Crime news: రూ.100 కోట్ల విలువైన ఆస్తి.. కుటుంబానికి తెలీకుండా విక్రయం!
Mumbai crime: ఆర్థిక రాజధాని ముంబయిలో ఓ మహిళ తన సోదరులతో కలిసి పెద్ద కుట్రకు తెరలేపింది. రూ.100 కోట్ల విలువైన కుటుంబ ఆస్తిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించింది.
Mumbai crime | ముంబయి: డబ్బు కోసం ఓ మహిళ పెద్ద కుట్రకు తెరతీసింది. తన సొంత అన్నదమ్ములతో కలిసి ముంబయి నడిబొడ్డున ఉన్న రూ.100 కోట్ల విలువైన ఆస్తిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించింది. తీరా విషయం ఆస్తి హక్కు కలిగిన ఇతర సోదరులకు తెలియడంతో గుట్టురట్టైంది. వారి ఫిర్యాదు మేరకు అబిదా జాఫర్ ఇస్మాయిల్ (58) అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె కస్టడీలో ఉన్నారు.
సెంట్రల్ ముంబయిలో ఈ ఆస్తి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతం బిజినెస్ హబ్గా అవతరించింది. అక్కడున్న భవనాల్లో వేర్వేరు కుటుంబాలు అద్దెకుంటున్నాయి. ఈ ఆస్తి విలువ సుమారు రూ.100 కోట్ల పైమాటే. వాస్తవంగా ఈ ఆస్తి అన్నదమ్ములైన జాఫర్ కపాడియా, లతీఫ్ కపాడియాది. వీరి మరణానంతరం వారి వారసులకు హక్కులు దఖలుపడ్డాయి. అద్దె ద్వారా వస్తున్న మొత్తం లతీఫ్ కుటుంబానికి వస్తోంది. లతీఫ్ పెద్ద కుమారుడు అజీజ్ (74) ప్రాపర్టీకి సంబంధించి నిర్వహణ, ఇతర వ్యవహారాలు చూస్తుంటాడు. లతీఫ్కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు అజీజ్, రహీమ్, అమీనా, అబిదా, మాలిక్ ఉన్నారు. జాఫర్కు ఫర్జానా, రుక్సానా, రెహానా, అమిన్, అన్వర్, మెహజబీన్, అయాజ్ పిల్లలున్నారు.
జాఫర్ కుమారుడు అయిన అయాజ్కు ఇటీవల ఆస్తి అమ్మకం గురించి విషయం తెలిసింది. తమ ఉమ్మడి ఆస్తికి సంబంధించి లతీఫ్ కుటుంబం ఓ డెవలపర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఆస్తికి సంబంధించి పూర్తి హక్కులు తమకే ఉన్నట్లు పత్రాలు సృష్టించి డెవలపర్కు విక్రయించినట్లు తెలిసింది. తమకు తెలీకుండా గుట్టుచప్పుడు కాకుండా ఆస్తిని విక్రయించడంపై అయాజ్ పోలీసులను ఆశ్రయించాడు. సోదరులకు పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న అమినా ఆ డాక్యుమెంట్లపై సంతకం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు ప్రతిగా రూ.3.5 కోట్లు నగదు రూపంలో, కొత్త భవనంలో రెండు ఫ్లాట్లు ఇచ్చేందుకు ఆమెతో ఇతర సోదరులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అమీనా, రహీమ్, మాలిక్కు డబ్బులు అవసరం అవ్వడంతో ఈ కుట్రకు తెరలేపారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అబిదా ఇస్మాయిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్