రూ.3 లక్షల్లో ముచ్చటైన ఇల్లు
నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులు, దానికి వినియోగించే సామగ్రి ఖర్చులు తీవ్రంగా పెరిగి పోయాయి. చిన్నపాటి ఇల్లు కట్టాలన్నా.. కనీసం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవుతోంది.
ఆదివాసీల కోసం ప్రత్యేక నిర్మాణాలు
న్యూస్టుడే, ఆసిఫాబాద్, తిర్యాణి
కెరమెరి మండలం శివగూడలో ప్రయోగాత్మకంగా కట్టిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇల్లు
నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులు, దానికి వినియోగించే సామగ్రి ఖర్చులు తీవ్రంగా పెరిగి పోయాయి. చిన్నపాటి ఇల్లు కట్టాలన్నా.. కనీసం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవుతోంది. అంత డబ్బులు వెచ్చించే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ఆదివాసీల ఇళ్లు చాలా వరకు చుట్టూ కర్రలు, తడకలు అల్లుకొని పైన గూణతో నిర్మించుకుంటారు. బలంగా గాలి వీచినా.. భారీ వర్షం కురిసినా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గడపాల్సిన పరిస్థితి. దీనికితోడు కొండలు, గుట్టలపై ఆవాసాలు ఏర్పరచుకునే గిరిజనులకు నిర్మాణానికి అవసరమైన కంకర, ఇసుక, ఇటుక, సలాక తదిర సామగ్రి అక్కడికి తీసుకెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని.
ఈ నేపథ్యంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానం సరైనది అని గుర్తించారు గతంలో కుమురం భీం జిల్లా అడిషినల్ కలెక్టర్గా పనిచేసిన వరుణ్రెడ్డి(ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టర్). తాను శిక్షణలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో గమనించిన విధానం తనను ఆకట్టుకోవడంతో ఆలోచనను అప్పటి కలెక్టర్ రాహుల్రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ ఇంజినీర్లతో సర్వే చేయించి చివరి ఓ నిర్ణయానికి వచ్చారు. దీనివల్ల లాభాలే కానీ నష్టాలు లేవని గ్రహించి జిల్లాలో ప్రయోగాత్మకంగా తిర్మాణిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కెరమెరి మండలం శివగూడలో ఇల్లు నిర్మించారు. దానికి స్పందన రావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 92 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
వంట గదిలో నల్లా పరిశీలిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ భీంరావు, పంచాయతీరాజ్ ఈఈ రామ్మోహన్రావు
ఫలించిన ప్రయోగం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలే ఎక్కువ. గిరిజనల్లో కొలాంలు అన్ని రంగాల్లోనూ అత్యంత వెనుకబడి ఉన్నారు. పూరి గుడిసెలే వీరికి ఆధారం. ఇలాంటి వారి కోసం కుమురం భీం జిల్లాలో మూడు ప్రాంతాల్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో 40 ఇళ్ల నిర్మాణాలకు అధికారులు సీసీడీపీ(కన్సర్వేషన్ కమ్ డెవలప్మెంట్ ప్లాన్) నిధులు కేటాయించారు. ఈ పనులను గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొదట కుమురం భీం జిల్లా కెరమెరి మండలం శివగూడలో ప్రయోగాత్మకంగా నిర్మించారు. ఇల్లు చూడటానికి బాగా ఉండటంతో తిర్యాణి మండలం భీంజిగూడ పంచాయతీ పరిధిలోని బుగ్గగూడలో 13, కెరమెరి మండలం శివగూడలో 13, సిర్పూర్(టి) మండలం కొలాంగూడ వేంపల్లిలో 12 చొప్పున నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటి వరకు 13 పూర్తి కాగా తొమ్మిది నిర్మాణంలో ఉన్నాయి. మిగతావి ప్రారంభించాల్సి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 92 ఇల్లు మంజూరైనట్లు కుమురం భీం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి భీంరావ్ తెలిపారు.
తిర్యాణి మండలం బుగ్గగూడలో నిర్మిస్తున్న ఇళ్లు
తక్కువ ఖర్చుతో మన్నికగా
ఒక్కో ఇంటిని 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మొదట బేస్మెట్ నిర్మించి ఇనుప చువ్వలతో ప్రేమ్ ఏర్పాటు చేస్తారు. వాటి చూట్టూ సిమెంట్ మిశ్రమంతో తయారు చేసిన 75 ఎంఎం(మూడు అంగుళాల) మందం గల ఏరోకాన్ ప్యానళ్లను అమరుస్తున్నారు. దీనికి టాటా- ఏరోనాటికల్ షీట్ష్(హైదరాబాద్) వారి సాయం తీసుకుంటున్నారు. పైకప్పు రేకుల ద్వారా వేసవిలో వేడిమి నుంచి రక్షణకు పాల్సీలింగ్ వేస్తున్నారు. టైల్స్ ఫ్లోరింగ్, లప్పం, నల్లాలు, విద్యుత్తు, రంగులు వేసి ఆకర్షణగా మలుస్తున్నారు. ఇంటి నిర్మాణం కేవలం రూ.మూడు లక్షల్లోనే పూర్తవుతోంది. ఇది సుమారు 25 ఏళ్ల వరకు మన్నికగా ఉంటుందని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. గాలి, వానలను తట్టుకొంటుందని.. అగ్ని ప్రమాదాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని చెబుతున్నారు. ఒక్కోసారి ఆదివాసీ గ్రామాల్లో విభేదాలు వచ్చినప్పుడు.. వర్గాలు చీలిపోయి అడవులకు సమీపంలో తాత్కాలిక గుడిసెలు వేసుకొని జీవిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఈ రెడీమేడ్ ఇళ్లను.. విప్పుకొని సామగ్రిని వెంట తీసుకొని మళ్లీ నిర్మించుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
తిర్యాణి మండలం బుగ్గగూడలో 34 కొలాం కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ అందరివి దాదాపుగా ఇలా కర్రలు, తడకలతో కట్టిన ఇళ్లే ఉన్నాయి. మొదటి విడతలో వీళ్లకు 13 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు నిర్మిస్తున్నారు.
కుటుంబాలకు..
కొలాం మొదట ఆదివాసీల్లో అత్యంత వెనుకబడిన కొలాం కుటుంబాలకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో అధికారులు ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. రోజుల వ్యవధిలో తక్కువ విస్తీర్ణంలో అతి తక్కువ వ్యయంతో రెండు గదులు(లబ్ధిదారు ఇష్టాన్ని బట్టి కిచెన్, హాల్, బెడ్రూం) నిర్మిస్తారు. మరుగుదొడ్ల నిర్మాణాలు సైతం ఈ విధానంలో చేపడుతున్నారు.
పనులు పూర్తి కావొచ్చాయి..
- ఆత్రం భీంరావు, బుగ్గగూడ
వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. రేకుల షెడ్డులో భార్య, ఇద్దరు పిల్లలతో తలదాచుకుంటున్నాం. ఏటా వానాకాలం వచ్చిందంటే భయంతో గడపాల్సిన పరిస్థితి. ఇంట్లో నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పక్కా నిర్మాణంతో తమకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఇంటి నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండలంలో భాజపా ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
తాంసి మండలంలోని వడ్డాడిలో గురువారం భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
మండలంలోని హస్నాపూర్, వడ్డాడి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పొన్నారిలో భారాస ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
తాంసి మండలం పొన్నారిలో గురువారం భారాస నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
హజ్ యాత్రికులకు టీకా కార్యక్రమం
[ 02-05-2024]
ఈ ఏడాది జిల్లా నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు కమిటీ జిల్లా అధ్యక్షులు షాహిద్ అహ్మద్ ... -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
[ 02-05-2024]
పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఠాకూర్ హోటల్ వద్ద మురుగు కాలువలో గుర్తు తెలియని మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. -
శ్రేణులకు నిర్దేశం.. జనజాతరకు సిద్ధం
[ 02-05-2024]
ఆదిలాబాద్లో ఏప్రిల్ 22న ఇప్పటికే జనజాతర సభ పేరిట ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆసిఫాబాద్లో జన జాతర సభ నిర్వహిస్తున్నారు. -
రైస్ మిల్లులకు తాళాలు..
[ 02-05-2024]
జిల్లాలో రైస్ మిల్లుల బాగోతాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. పోలీసుల కేసు నమోదుతో రైస్ మిల్లులకు తాళాలు వేసి వ్యాపారులు పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఒక్క అవకాశం కోసం అడుగుతున్నాం : మంత్రి సీతక్క
[ 02-05-2024]
‘ఆదిలాబాద్ నుంచి తొలిసారిగా ఆదివాసీ ఆడబిడ్డ, సామాన్య మహిళను పార్లమెంటుకు పంపిద్దాం.. ఒక్క అవకాశం ఇవ్వండి.. అన్ని జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్నారని..’ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ఓపీ చీటీ తీసుకోవటం మరింత సులువు
[ 02-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఓపీ(అవుట్ పేషెంట్) చీటీ తీసుకోవటానికి రోగులు, వారి సహాయకులు ఇక నుంచి గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదు. -
బరిలో 42 మంది.. బ్యాలెట్ యూనిట్లు
[ 02-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుస్థానానికి 42 మంది పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరముంది. -
ఆర్టీయూకేటీ ప్రవేశాల నోటిఫికేషన్కు నిరీక్షణ
[ 02-05-2024]
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల నోటిఫికేషన్ కోసం విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆర్జీయూకేటీలో నేరుగా ప్రవేశాలు పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. -
పని ప్రదేశమే.. ప్రచార వేదిక
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మండుటెండల్లో వచ్చాయి. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండల దృష్ట్యా తెల్లవారంగానే పలుగు పారబట్టి పనులకు వెళుతున్నారు. -
అగ్నిగోళంగా ఆదిలాబాద్
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో బుధవారం సగటు ఉష్ణోగ్రత 42.9 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. మూడు రోజులుగా వడగాల్పుల తీవ్రత అధికమైంది. గత నెలలో వడదెబ్బ కారణంగా నలుగురు మృతి చెందారు. -
ముల్లె సదురుకున్నాం.. ఎల్లి పోతావున్నాం!
[ 02-05-2024]
‘ఏమున్నదక్కో.. ఏమున్నదక్కో.. ముల్లె సదురుకున్నా.. ఎల్లి పోతావున్నా.. ఈ ఊళ్లో నాకింక ఏమున్నదక్కో’ అంటూ ఓ సినీ గేయ రచయిత రాసిన గేయం ఇక్కడి ఆదివాసీలకు సరిగ్గా సరిపోతోంది. -
పర్యవేక్షణ బరువు.. వ్యవ‘సాయం’కరవు
[ 02-05-2024]
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఎరువుల దుకాణాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో డీలర్లు ఇష్టానుసారంగా పురుగుమందులను అన్నదాతలకు అంటగడుతున్నారు. -
మద్యం వ్యాపారుల.. ‘మిలాఖత్’!
[ 02-05-2024]
మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి కల్తీ, నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మాటల వేఢీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తూ పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. -
తెల్లవారుజామున ఎస్ఈ బదిలీ ఉత్తర్వులు
[ 02-05-2024]
విద్యుత్తు సంస్థ జిల్లా ఎస్ఈ రాథోడ్ శేషారావు ఆకస్మిక బదిలీ అయ్యారు. కార్పొరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని బుధవారం తెల్లవారుజామున ఉత్తర్వులు వచ్చాయి. -
మీటరు గిరగిర..
[ 02-05-2024]
సూర్యుడి ప్రతాపంతో జిల్లాలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. వేడి కారణంగా ప్రజలు ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. -
ఎట్టకేలకు హస్తం గూటికి..
[ 02-05-2024]
నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీ, మరో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎట్టకేలకు బుధవారం భారాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. -
భానుడి భగభగలు.. జనం బెంబేలు
[ 02-05-2024]
వేసవితాపంతో అల్లాడి పోతున్నారు జనం. మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
సరిహద్దు చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా
[ 02-05-2024]
ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేపడుతున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ముథోల్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. -
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
[ 02-05-2024]
ఆడబిడ్డను పోటీ చేస్తున్నా.. ఆదరించి ఆశీర్వదించండి.. అభివృద్ధి చూసి చూపిస్తానని ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి