అరచేతిలో అతివకు భద్రత
ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా అతివలపై జరుగుతున్న నేరాలు ఆగడం లేదు. ఇప్పటికే మహిళలు, యువతుల, విద్యార్థినుల భద్రతకు అనేక మొబైల్ యాప్లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోలీసుశాఖ తాజాగా టీ-సేఫ్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
పోలీసుశాఖ టీ-సేఫ్ యాప్ ప్రారంభం
మంచిర్యాలనేరవిభాగం, న్యూస్టుడే: ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా అతివలపై జరుగుతున్న నేరాలు ఆగడం లేదు. ఇప్పటికే మహిళలు, యువతుల, విద్యార్థినుల భద్రతకు అనేక మొబైల్ యాప్లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోలీసుశాఖ తాజాగా టీ-సేఫ్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 12న ప్రారంభించారు.
ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడికి వెళ్లినా తమ వివరాలు అందులో నమోదు చేసుకుని ప్రయాణం చేస్తే పూర్తి సమాచారం పోలీసుశాఖ ఆధీనంలోకి వెళ్తుంది. వారి నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు ఉంటాయి. స్పందన లేని పక్షంలో వెంటనే పోలీసులు మొబైల్ నెంబరు ఆధారంగా ట్రాకింగ్ చేసి వారు ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుని రక్షిస్తారు. మంచిర్యాల జిల్లాలో గడిచిన ఏడాదిలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై 145 కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా వివిధ రకాలుగా మహిళలు ఎదుర్కొన్న వేధింపులపై వందల్లో ఉన్నాయి.
డౌన్లోడ్ ఇలా..
పోలీసుశాఖ రూపొందించిన టీ-సేఫ్ యాప్ను గూగుల్ప్లే స్టోర్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబరు ఇచ్చి లాగిన్ కావాలి. ఆ తర్వాత అందులో పేరు, ఆడ, మగ అనే వివరాలు నమోదు చేసుకోవాలి. మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఈ నెంబరును అందులో ఎంటర్ చేయాలి. వెంటనే వెరిఫై(పరిశీలన) చేసుకుంటుంది. మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ నమోదు చేసుకోవాలి. ప్రయాణిస్తున్న ప్రాంతం వివరాలు, వాహనం పేరు, నంబరు నమోదు చేస్తే పూర్తి వివరాలు పోలీసుల నిఘా పరిధిలోకి వెళ్తాయి.
వినియోగం ఇలా..
ప్రయాణించే సమయంలో దీన్ని ఆన్ చేసుకుంటే టీ-సేఫ్ యాప్ వినియోగదారుల నుంచి ఎలాంటి సమాచారం రాకపోతే వెంటనే పోలీసులు అప్రమత్తమవుతారు. బేసిక్ ఫోన్, స్మార్ట్, ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఆటోమెటిక్ సేఫ్టీ మెసేజ్ వస్తుంది. వాటికి నాలుగు అంకెల సీక్రెట్ పాస్కోడ్ పంపించాలి. దాని ఆధారంగా మనం సురక్షితంగా ఉన్నామని పోలీసులు గుర్తిస్తారు. ఎలాంటి స్పందన లేకుంటే అప్రమత్తమై మనం ఉన్న చోటకు పోలీసులు వస్తారు. 110, 112 నంబరుకు ఫోన్ చేసి ఐవీఆర్ ఆప్షన్ ద్వారా చరవాణిలో ఉండే ఎనిమిది నంబరును ఎంపిక చేసుకుని మానిటరింగ్ రిక్వెస్టు పెట్టాలి. వెంటనే పోలీసుల పర్యవేక్షణ మొదలవుతుంది. తెలంగాణ సరిహద్దులను దాటినా, ఎక్కువ సమయం ఎక్కడైనా ఆగినా, ప్రయాణ మార్గం మారినా టీ సేఫ్ కంట్రోల్రూం నుంచి నేరుగా 100 డయల్కు అటోమెటిక్గా ఫోన్కాల్ వెళ్తుంది. వెంటనే స్పందించి సురక్షితమని చెబితే సరిపోతుంది. లేదంటే నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారు.
నిర్భయంగా ఉండేందుకే..
- శ్రీనివాస్, రామగుండం పోలీసు కమిషనర్
మహిళలు ఎట్టిపరిస్థితుల్లోను అధైర్యానికి గురికావొద్దు. ప్రతి ఒక్కరిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే పోలీసుల లక్ష్యం. అందుకోసమే టీ సేఫ్ యాప్ను రూపొందించారు. మహిళలు, యువతులు, విద్యార్థినులు ఈ యాప్ను వినియోగించుకోవాలి. ఆపదలో ఉన్న మహిళ ఈ యాప్ ద్వారా సురక్షితంగా బయటపడవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాస్త్రీయ కళలు ఈ తరానికి అందించడం అభినందనీయం
[ 27-04-2024]
కనుమరుగవుతున్న భారతీయ శాస్త్రీయ కళలను ఈ తరానికి అందించడం అభినందనీయమని న్యాయమూర్తి క్షమా దేశ్ పాండే, ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్ అన్నారు. -
అంతర్ రాష్ట్ర రహదారిపై భాజపా నాయకుల రాస్తారోకో
[ 27-04-2024]
పొన్నారిలో గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా రహదారి, ఇళ్లపై ఏర్పాటుచేసిన కాషాయరంగు జెండాలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. -
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్