logo

ఎంపీగా సుగుణక్కను గెలిపించుకుంటాం

ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించిన సుగుణక్కను పార్టీ కార్యకర్తలు అందరూ ఐక్యంగా కృషిచేసి గెలిపించుకుంటామని పార్టీ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ అన్నారు.

Updated : 28 Mar 2024 13:22 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించిన సుగుణక్కను పార్టీ కార్యకర్తలు అందరూ ఐక్యంగా కృషిచేసి గెలిపించుకుంటామని పార్టీ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ అన్నారు. స్థానిక ప్రింట్ మీడియా పాత్రికేయ ప్రాంగణంలో కార్యకర్తలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. సుగుణక్కను ఎంపీ అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకి వివరిస్తూ ఆమె గెలుపు కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుడిపెళ్లి నగేష్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కాడే సంతోష్, నాయకులు అలిమ్ మహేందర్, వెంకన్న, సలీమ్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని