గెలుపే లక్ష్యం.. చేరికలకు ప్రాధాన్యం
పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. కీలక నేతలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు.
చెన్నూరు గ్రామీణం, న్యూస్టుడే
పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. కీలక నేతలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. ఓవైపు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. చేరికలతో ఎంతో కొంత కలిసివస్తుందని భావించి అందుకు తగిన ప్రాధాన్యమిస్తున్నారు. పల్లె, పట్టణం, మండలస్థాయి ప్రజాప్రతినిధులు, కీలక ద్వితీయ శ్రేణి నాయకులు ప్రధానపార్టీల్లో చేరుతున్నారు. వారితో ఎంతోకొంత కలిసి వస్తుందని భావిస్తూ చేరికలకు తగిన ప్రాధాన్యమిస్తున్నారు. ప్రజల్లో వారికున్న ఆదరణ తమకు ఓట్ల రూపంలో లబ్ధి కలుగుతుందని అంచనా వేసుకుంటున్నారు. జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలో కొనసాగుతున్న చేరికలపై కథనం..
సంప్రదిస్తూ.. పార్టీలోకి ఆహ్వానిస్తూ!
లోక్సభ పోలింగ్కు తక్కువ సమయం ఉండటంతో జిల్లాలో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. భానుడి భగభగ కారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పల్లెలు, పట్టణాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇక రాత్రివేళల్లో తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు వివరాలను మధ్యవర్తుల ద్వారా ఆరా తీస్తూ పార్టీలోకి వచ్చేలా చేస్తున్నారు. పార్టీలోకి వస్తామనే నేతల ఓటు బ్యాంకు ఎంత? సామాజిక వర్గంలో వారికున్న బలం ఆధారంగా అభ్యర్థులు వారికి భవిష్యత్తు భరోసా కల్పిస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పదవుల్లో కొనసాగుతున్న వారితో పాటు కీలక నేతలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే పార్టీలో సముచిత స్థానంతో అన్నివిధాల అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు.
సొంత పార్టీ నాయకుల నిరసన..
ఈ చేరికలపై సొంత పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత వస్తోంది. పార్టీలోకి చేర్చుకోవద్దని బహిరంగంగానే ఆందోళన చేపడుతున్నారు. ఇటీవల జిల్లాలోని ఓ నియోజకవర్గంలో చేరికలను సొంత పార్టీ నాయకులే అడ్డుకొని ఆందోళన చేశారు. చేరికలతో తమకు కలిసి వస్తుందని భావిస్తున్న నేతలు వారిని మరోలా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది. ఇతర ప్రాంతాల్లో చేరికలు ఉన్న సమయంలో వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్నవారు గెలిచిన తర్వాత పార్టీలోకి తీసుకోవడంపై నాయకులు, కార్యకర్తల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఇది ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి.
- జిల్లాలోని ఓ నియోజకవర్గంలోని రెండు మండలాలకు చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, పార్టీని వీడి మరో పార్టీలో చేరారు. వీరి చేరికలతో తమకు ఎంతోకొంత కలిసివస్తుందని నేతలు భావిస్తుండగా.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందుచూపుతో వారొస్తున్నారని సొంత పార్టీ నాయకులు పెదవి విరుస్తున్నారు.
- జిల్లాలోని ఓ నియోజకవర్గంలోని పురపాలికకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మండలానికి చెందిన మహిళా ప్రతినిధిని సొంత పార్టీని వీడి మరో పార్టీలో చేరారు. వీరి చేరిక రాజకీయాల్లో అనూహ్యంగా పలువురు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా రాజీవ్ వర్ధంతి
[ 21-05-2024]
పట్టణంలోని ప్రజా సేవాభవన్లో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలి
[ 21-05-2024]
రైతులు కోరిన పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలని అఖిలపక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తత్రి డిమాండ్ చేశారు. -
అర్హత లేకున్నా.. చికిత్స..!
[ 21-05-2024]
నిబంధనల ప్రకారం రోగులకు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు మాత్రమే ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు అవకాశముంది -
మూడేళ్లుగా ముప్పుతిప్పలు
[ 21-05-2024]
కోటపల్లి మండలంలోని ప్రాణహిత తీరప్రాంత గ్రామాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారిని బాగు చేయడంలో మూడేళ్లుగా నిర్లక్ష్యం వెంటాడుతోంది. -
తరుగు పేరిట దోపిడీ
[ 21-05-2024]
అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే రైతులు దోపిడీకి గురవుతున్నాడు. అకాల వర్షాలతో కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టేందుకు అనేక అవస్థలు పడ్డారు -
అధికార్ల మెలిక.. అన్నదాత తికమక
[ 21-05-2024]
వానాకాలం పంటల సాగు నేపథ్యంలో.. ఇప్పటికే పలువురు రైతులు భూములను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. కానీ అటవీహక్కు పత్రాలు కలిగిన భూముల్లో ట్రాక్టర్లతో దున్ననివ్వకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు -
ఎమ్మెల్యే హరీశ్బాబును అడ్డుకున్న పోలీసులు
[ 21-05-2024]
జైనూరు మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఓ వర్గం సభ్యులు గాయపడిన విషయం విదితమే. -
తోటి మిత్రులే హంతకులై.!
[ 21-05-2024]
మండలంలోని గన్నారంలో పలువురు మిత్రులు మద్యం మత్తులో తోటి స్నేహితుడిని దారుణంగా హతమార్చారు. -
రూ. 47 లక్షల విక్రయాలకు లెక్కల్లేవ్!
[ 21-05-2024]
రైతులకు రుణాలు అందించి సకాలంలో ఎరువులను సరఫరా చేసి అండగా నిలవాల్సిన వ్యవసాయ సహకార సంఘాలు అస్తవ్యస్త నిర్వహణతో గాడి తప్పుతున్నాయి. -
తడబడితే తప్పదు మూల్యం
[ 21-05-2024]
విద్యాసంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట ఆయా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. -
సర్కారు బడులు.. చకచకా పనులు
[ 21-05-2024]
భీంపూర్ జిల్లా పరిషత్ స్కూల్లో ప్రహరీ, టాయిలెట్లు, ఫ్లోరింగ్, విద్యుత్తు వంటి మరమ్మతులతోపాటు తాగునీటి సౌకర్యం కోసం కుళాయిలు ఏర్పాటు చేశారు -
రెండేళ్లుగా ఎదురుచూపులే
[ 21-05-2024]
తాంసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 2023లో కేంద్ర బృందం సందర్శించింది. రోగులకు ఉత్తమ వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, మందుల నిల్వలు తదితర విషయాల్లో అత్యుత్తమ పనితీరుతో ఎన్క్వాస్కు ఎంపిక చేశారు. -
విత్తన గుట్టు విప్పండి..
[ 21-05-2024]
‘‘ మీరు కోరుకున్న కంపెనీ విత్తన సంచి కావాలంటే మేం చెప్పే మరో కంపెనీకి చెందిన రెండు విత్తన సంచులు కొనాలి. లేనట్లయితే మీరు చెప్పే విత్తనాలు ఇవ్వటం కుదరదు. -
మానవతావాదులు స్పందించారు..
[ 21-05-2024]
బ్రెయిన్ స్ట్రోక్తో అపస్మారక స్థితిలో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుడు శంకర్ జాడే చికిత్స నిమిత్తం మానవతావాదులు తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనా ఆక్రమిస్తే.. కిల్ స్విచ్ ఆన్ అవుతుంది: సెమీకండెక్టర్ తయారీ సంస్థల ప్లాన్..!
-
యూరప్ ట్రిప్ మరింత భారం.. షెంజెన్ వీసా ఫీజు పెంపు
-
బీఎస్ఈ మార్కెట్ క్యాప్ @ 5 ట్రిలియన్.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం
-
తొలి క్వాలిఫయర్.. అభిషేక్కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్
-
సిట్ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్తో డీజీపీ భేటీ