logo

ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కె.ప్రభాకర్‌రావు

ఆదిలాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్‌గా కె.ప్రభాకర్‌రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. 

Published : 01 May 2024 03:07 IST

ప్రభాకర్‌రావుకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలుకుతున్న బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

ఎదులాపురం, న్యూస్‌టుడే : ఆదిలాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్‌గా కె.ప్రభాకర్‌రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు ఇక్కడ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన సీహెచ్‌ వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌ కామారెడ్డికి బదిలీ కాగా ఆయన స్థానంలో సంగారెడ్డిలో పని చేస్తున్న ప్రభాకర్‌రావును హైకోర్టు నియమించింది. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్రాల నగేష్‌ ఆధ్వర్యంలో అసోసియేషన్‌ ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అదే విధంగా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ ప్రధాన, ఉప, సహాయ న్యాయవాదులు దాసరి గంగారాం, అరుగుల అశోక్‌, ఉమేష్‌ డోలెలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు. పలువురు న్యాయవాదులు తమను తాము ఆయనకు పరిచయం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని