logo

భాజపా గెలుపు ఖాయం: ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌ అన్నారు.

Updated : 05 May 2024 10:47 IST

ఉట్నూరు గ్రామీణం: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌ అన్నారు. ఉట్నూరు మండలంలో భాజపా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎక్స్ రోడ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో భాజాపాకు ఓటు వేయాలని కోరారు. అబద్ధపు హామీలు, కట్టుకథలు చెప్పే కాంగ్రెస్‌, భారాస మాటలు నమ్మొద్దని పేర్కొన్నారు. అనంతరం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ సమక్షంలో మాజీ జెడ్పీటీసీ జగ్జీవన్, భారాస  మండల అధ్యక్షుడు కందుకూరి రమేష్‌తో పాటు పలువురు సర్పంచులు భాజాపాలో చేరారు. గోడం నగేష్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని