logo

ప్రశాంతంగా నీట్ పరీక్ష

ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

Published : 05 May 2024 17:08 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మూడు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1, 785 మంది పరీక్ష రాశారు. 48 మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష ఉన్నప్పటికీ ఉదయం 11 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతించారు. బయోమెట్రిక్ తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన వారిని వచ్చినట్లు లోనికి పంపించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కేంద్రాలు తెలియక అవస్థలు పడ్డారు. ఎండ దృష్ట్యా కేంద్రాల వద్ద షామియానాలు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని