sbi rewardz apk: బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులనో.. ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైనవారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు.
సైబర్ నేరస్థుల కొత్త పంథా
ఎస్బీఐ రివార్డ్స్ పేరిట వచ్చిన సందేశం, యాప్ లింకు
స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులనో.. ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైనవారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో కొద్దిగా మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు తమ పంథాను మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా ఎస్బీఐ రివార్డ్స్ పేరిట నకిలీ లింకులను చేరవేస్తున్నారు.
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే:
తెలిసిన నంబరు నుంచి..
- నిర్మల్ పట్టణానికి చెందిన ప్రవీణ్కుమార్ స్థానికంగా వీడియోగ్రాఫర్. పరిచయాలు ఎక్కువ. ఇతడి వాట్సప్ నంబరు నుంచి పలు గ్రూపులకు ఎస్బీఐ రివార్డ్స్ పేరిట సందేశం చేరింది. దీంతోపాటు ఓ లింకు కూడా జతైంది. ఎందుకిలా పంపిస్తున్నారని అందరూ విస్తుపోయారు. ఒకరిద్దరు అతడికి కాల్ చేసి విషయంపై ఆరా తీశారు. తన ఫోన్లో వాట్సప్ పనిచేయడం లేదని, తనకు తెలియకుండానే ఎవరో హ్యాక్ చేశారని చెప్పడంతో వారు విస్తుపోయారు. లింకులేవీ తెరవొద్దని సూచించారు.
- ఇటీవల జైనూరు మండలం శివునూర్కు చెందిన ఓ యువ రైతు ఈ లింకు బారిన పడి డబ్బులు నష్టపోయారు. తమ గ్రామం పేరిట ఉన్న వాట్సప్ గ్రూపులో ఎస్బీఐ రివార్డ్స్ లింకు రావడంతో నిజమని దాన్ని తెరిచారు. అతడి ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా అయినట్లు సందేశం రావడంతో విస్తుపోయారు. వెంటనే పోలీసులకు, బ్యాంకు మేనేజరుకు ఫిర్యాదు చేశారు.
ఇవి తాజాగా ఉమ్మడి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఘటనలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట వాట్సప్లో రివార్డ్స్ లింకు విస్తృతంగా ప్రచారమవుతోంది. తెలిసిన నంబర్ల నుంచే ఇది వస్తుండటంతో దాన్ని చూసినవారు నిజమని నమ్ముతున్నారు. ఫలితంగా సులభంగా మోసపోయేందుకు అవకాశం ఏర్పడుతోంది. ‘మీ ఎస్బీఐ రివార్డ్ రూ.7,250 యాక్టివేట్ అయింది. అది ఈ రోజు ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి’.. అంటూ సందేశంలో పేర్కొంటున్నారు. ఎస్బీఐ యోనో పేరిట ఓ లింకును సైతం జత చేస్తున్నారు.
వివరాలు మారిపోతున్నాయి..
ఎవరైనా ఈ లింకును క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసేందుకు ప్రయత్నిస్తారో వారి వాట్సాప్ ప్రొఫైల్ ఫొటో, పేరు ఎస్బీఐగా మారిపోతున్నాయి. వివరాల్లో ఎస్బీఐ హెల్ప్లైన్ అంటూ వస్తుండటంతో చూసేవారందరూ అది నిజమైనదే కావొచ్చని భ్రమపడుతున్నారు. బాధితుడి ప్రమేయం లేకుండా అతడి ఫోన్లోని వివిధ వాట్సాప్ గ్రూపులకు సైతం ఈ లింకులు పోస్ట్ అవుతున్నాయి. పెద్దసంఖ్యలో వాట్సాప్ వినియోగదారులకు చేరుతుండటంతో ఒకరిద్దరు దీని బారినపడినా డబ్బులు నష్టపోక తప్పదు. ఇలా ఈ చైన్ లింకు ఒకరి నుంచి ఒకరికి చేరుతూనే ఉంది.
గుడ్డిగా నమ్మొద్దు
డా.జి.జానకి షర్మిల, జిల్లా పోలీసు అధికారి
సైబర్ మోసగాళ్లు కొత్త మార్గాల్లో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్బీఐ రివార్డ్స్ పేరిట వస్తున్న సందేశాలు సైతం ఈ తరహాలోనివే. తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చిందనో, మనవారే పంపారు కదా అని గుడ్డిగా నమ్మేయకుండా అప్రమత్తంగా ఉండాలి. లింకులేవీ తెరవొద్దు. సైబర్ నేరస్థుల ఉచ్చులో పడొద్దు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రతీ పోలీస్స్టేషన్లో సైబర్ వారియర్ పేరిట సిబ్బంది అందుబాటులో ఉన్నారు. సద్వినియోగం చేసుకోవాలి. అనుమానిత సందేశాలు, లింకుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టివేత
శంషాబాద్లో ఎక్సైజ్ పోలీసులుకు గంజాయి చాకెట్ల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. -
గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం.. బాండ్లపై సంతకాలు పెట్టించుకొని వదిలేశారు
నగరంలోని గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. ఎస్వోటీ పోలీసులమంటూ ఓ కంపెనీ ఎండీతోపాటు సేల్స్ కోఆర్డినేటర్ను దుండగులు కిడ్నాప్ చేశారు. -
గంగానదిలో పడవ మునక.. ఆరుగురు గల్లంతు
గంగా నదిలో పడవ బోల్తా పడి మునిగిపోయిన ఘటనలో ఆరుగురు గల్లంతయ్యారు. -
వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు
వితంతురాలైన వదినను పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని అతడి మిగతా సోదరులు కాల్చి చంపిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బాగ్పత్ గ్రామంలో వెలుగు చూసింది. -
రీల్స్ మోజులో ఇద్దరు బాలురి దుర్మరణం
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి బయటకు వచ్చిన ముగ్గురు బాలురు స్కూటీపై ప్రయాణిస్తూనే సెల్ఫోన్లో రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. -
ఉపాధి లేక... పూట గడవక..!
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. పైగా ఆరు నెలలుగా పనిలేదు. పూట గడవని దుస్థితితో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక కుంగిపోయిన ఓ చేనేత కార్మికుడు రైలు కిందపడి ప్రాణం తీసుకున్నారు. -
మావోయిస్టుల భారీ కుట్ర భగ్నం
ఇన్ఫార్మర్లు, పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు అమర్చేందుకు యత్నించిన మావోయిస్టుల భారీ కుట్రను ములుగు జిల్లా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. -
విమానాల్లో టక్కరి దొంగ
విమానాల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా కేటుగాడు ఆర్జీఐఏ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానాల్లో వెళ్తూ ఆరు చోరీలు చేసిన అతడి నుంచి కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది. దీంతో ఆదివాసీ పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంది. -
గోవుల రవాణా నేపథ్యంలో ఘర్షణ
గోవుల రవాణాను కొందరు అడ్డుకోవడంతో మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానగా మారి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో మెదక్ పట్టణంలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. -
బవారియా గ్యాంగ్ పంజా
నగరంపై ఉత్తరప్రదేశ్కు చెందిన భవారియా గ్యాంగ్ పంజా విసిరింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు వరుసగా నాలుగు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. -
కన్నకొడుకే కాలయముడు
ఆ తల్లిదండ్రుల పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు.. కనిపెంచిన వారిని కిరాతకంగా డబ్బు కోసం అంతమొందించాడు.. -
గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన భర్త
ఓ యువతిని పెళ్లాడిన వ్యక్తి ఆమెకు గుండె కుడి వైపు ఉందనే కారణంతో వదిలేశాడు. న్యాయపోరాటం చేయడంతో ప్రతినెలా మనోవర్తి చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్ కల్యాణ్పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
-
రేణుకాస్వామి హత్య కేసు.. ఆ కారు సీజ్!
-
శ్రీలంక-భారత్ ప్రతిపాదిత రోడ్డు మార్గం.. ద్వీపదేశం ఏమందంటే!
-
రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!
-
‘నాన్న నేర్పిందే నా పిల్లలకూ చెప్పాను’.. వేదాంత చీఫ్ భావోద్వేగ పోస్ట్
-
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!