logo

జొన్న పంట దగ్ధం

అదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రానికి చెందిన రైతు బెల్లపు అశోక్ రెండు ఎకరాల జొన్న పంట సాగు చేశారు.

Published : 05 May 2024 19:06 IST

తాంసి: అదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రానికి చెందిన రైతు బెల్లపు అశోక్ రెండు ఎకరాల జొన్న పంట సాగు చేశారు. మరో రెండు రోజుల్లో హార్వెస్టర్ యంత్రంతో నూర్పిడి చేయించవలసి ఉండగా, పక్క చేను ఓ రైతు చేనులో చెత్తకు నిప్పు పెట్టాడు. ఈదురుగాలులకు క్రమక్రమంగా మంటలు జొన్న చేనుకు వ్యాపించాయి. జొన్న పంట పూర్తిగా కాలిపోవడంతో సుమారుగా రూ. 70 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని