logo

భాజపాను ఓడించాలి

లోక్‌సభ ఎన్నికల్లో ఫాసిస్టు ఆర్ఎస్ఎస్, భాజపాని ఓడించాలని సీసీఐ నాయకుడు అన్నారు.

Updated : 06 May 2024 15:49 IST

ఎదులాపురం: లోక్‌సభ ఎన్నికల్లో ఫాసిస్టు ఆర్ఎస్ఎస్, భాజపాని ఓడించాలని సీసీఐ నాయకుడు అన్నారు. ఇండియా మహాకూటమి బలపరిచిన ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని గెలిపించాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జగన్ సింగ్ పిలుపునిచ్చారు. అదిలాబాద్ పట్టణంతోపాటు తలమడుగు మండలంలో ఆ పార్టీ నాయకులు ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్-భాజపా ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ప్రజలు, రాష్ట్రాల హక్కులపై దాడులు తీవ్రమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సురేష్, సాయికుమార్, నితిన్, విజయ్ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని