logo

ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో రాపర్తి ప్రకాష్ (56) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Published : 09 May 2024 16:16 IST

ఎదులాపురం: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో రాపర్తి ప్రకాష్ (56) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏఎస్ఐ మొహమ్మద్ యూనుస్ తెలిపిన వివరాల మేరకు.. కూలీ పని చేసుకుని జీవించే ప్రకాష్(56) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం పలుచోట్ల అప్పులు సైతం చేశారు. అనారోగ్య సమస్య తట్టుకోలేక జీవితంపై విరక్తితో గురువారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని