logo

మూడోసారి మోదీ ప్రధాని కావాలి

మోదీ మూడోసారి ప్రధాని కావాలని, అందుకు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో భాజపాను గెలిపించి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు.

Updated : 10 May 2024 15:22 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: మోదీ మూడోసారి ప్రధాని కావాలని, అందుకు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో భాజపాను గెలిపించి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మూడు ప్రధాన పార్టీల సీట్లు ఆదివాసులకే కేటాయించడం పట్ల ఉద్యమ నేతగా ధన్యవాదాలు తెలిపారు. భాజపా కార్యకర్తగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి నగేష్ సమావేశానికి దూరంగా ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గ అభారీ అల్జపూర్ శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ బోయర్ విజయ్, అశోక్, సురేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు