16న అచ్యుతాపురానికి సీఎం రాక
వైకాపా ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక విప్లవం జరుగుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఒకొహామా గ్రూపునకు చెందిన ఏటీజీ టైర్ల కంపెనీలో ఆయన శుక్రవారం కలెక్టర్ రవి పట్టన్శెట్టి, ఎమ్మెల్యే కన్నబాబు ...
ఏటీజీ టైర్ల కంపెనీ ప్రారంభోత్సవం.. మరో 8 పరిశ్రమలకు భూమిపూజ
నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యే కన్నబాబు
అచ్యుతాపురం, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక విప్లవం జరుగుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఒకొహామా గ్రూపునకు చెందిన ఏటీజీ టైర్ల కంపెనీలో ఆయన శుక్రవారం కలెక్టర్ రవి పట్టన్శెట్టి, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ సుకుమార్వర్మతో కలిసి పర్యటించారు. ఈనెల 16న ముఖ్యమంత్రి జగన్ ఈ పరిశ్రమలో ఉత్పత్తిని ప్రారంభిస్తారన్నారు. దీంతో పాటు మరో 8 పరిశ్రమల నిర్మాణానికి భూమిపూజ చేస్తారన్నారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి కాన్వాయి వంటి అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 120 దేశాలకు టైర్లను ఎగుమతి చేసే పరిశ్రమ ఇక్కడ ఏర్పాటుకావడం గొప్ప విషయమన్నారు. వంద ఎకరాల్లో రూ.1500 కోట్లుతో పరిశ్రమ ఏర్పడిందని, 200 మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తుందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత స్థలం కేటాయించి, నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మరో రూ.వెయ్యి కోట్లుతో ఈ పరిశ్రమను విస్తరించనున్నారని, దీని ద్వారా మరికొంతమందికి ఉపాధి లభిస్తుందన్నారు. స్థానిక సమస్యలతోపాటు అచ్యుతాపురం పరిశ్రమల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి దీన్ని మంచి వేదికగా మార్చుకోవాలన్నారు.
స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించి తీరుతాం
స్థానికులకు 75శాతం ఉపాధి కల్పించడం అనేది సరదాగా చెప్పిన అంశంకాదని అమర్నాథ్ అన్నారు. ఉపాధిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతిలో ఏర్పాటుచేసిన ఆపాచీ కంపెనీలో 10 వేల మందికి ఉపాధి కల్పించగా వారిలో 79శాతం మంది స్థానికులే అన్నారు. ఏటీజీ పరిశ్రమలో కూడా కశింకోట ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్లో చదువుకున్న 49 మంది డిప్లమో విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రస్తుతం 69 శాతం ఉపాధి స్థానికులకే కల్పించామని మంత్రి ప్రకటించారు. మార్టూరుకు చెందిన భూముల్లో పరిశ్రమను ఏర్పాటుచేసి గ్రామస్థులకు ఉపాధి కల్పించడానికి కంపెనీ ముందుకురాలేదని అచ్యుతాపురం వైస్ ఎంపీపీ అల్లంపల్లి లక్ష్మి, మార్టూరు సర్పంచి కేకేవీ సీతారామరాజు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కళాసీ, హౌస్కీపింగ్ పనులు అందించి స్థానికులకు ఉపాధి కల్పించామని కంపెనీ ప్రతినిధులు మోసగిస్తున్నారని వైకాపాకు చెందిన దిబ్బపాలెం సెజ్ కాలనీని అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బైలపూడి రాందాసు మంత్రి వద్ద విచారం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ సభ్యులు లాలం రాంబాబు, నర్మాలకుమార్, వైకాపా నాయకులు కోన బుజ్జి, దేశంశెట్టి శంకరరావు, వెంకునాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం