దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు.
జీతాల సమస్యల్లేకుండా ఉత్తర్వులు
ఈనాడు, పాడేరు : ‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. మరి తన తండ్రి సమానుడిగా ప్రకటించిన అమాత్యుని శాఖలో జరిగిన దొడ్డిదారి బదిలీలు ఆయనకు కనిపించలేదేమో. గతేడాది సాధారణ బదిలీలు తర్వాత కొంతమంది ఉపాధ్యాయులు నేతలతో సిఫార్సు చేయించుకుని స్థానచలనం పొందారు. దీనికోసం ఒక్కో టీచర్ రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు డీఈవో కార్యాలయం నుంచి విద్యాశాఖ మంత్రిత్వ కార్యాలయం వరకు చదివించుకున్నట్లు ఆరోపణలున్నాయి. కౌన్సెలింగ్తో సంబంధం లేకుండా కాసులతోనే నచ్చిన చోటుకు కొలువును మార్చుకున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 60 మంది వరకు దొడ్డిదారి బదిలీ చేసుకున్నట్లు సమాచారం. వారిలో 26 మంది రెండు నెలలు కిందటే వారికి కేటాయించిన స్కూళ్లలో చేరిపోయారు. అయితే అడ్డదారిలో బదిలీలు చేసుకోవడంతో జీతాలు చెల్లించడానికి ట్రెజరీల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా వారి జీతాల సమస్యను పరిష్కరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యాశాఖ ఉన్నతాధికారి డీఈవో కార్యాలయాలకు ఉత్తర్వులు జారీచేసి రాచమార్గం చూపించారు. మొదటి విడతలో 26 మంది సిఫార్సు బదిలీలతో కొత్త పాఠశాలల్లో చేరగా మిగతావారు రెండో విడతలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో కొన్ని ఖాళీలను విద్యాశాఖ అధికారులు బ్లాక్ చేశారు. వాటిలో కొన్నింటిని దొడ్డిదారి బదిలీలపై వచ్చిన వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
ఏజెన్సీ నుంచి నగరానికే..
నా ఎస్సీలు, నా ఎస్టీలు అనే జగన్.. ఈరోజు అదే ఎస్టీ పిల్లలు చదువుకునే పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను దొడ్డిదారిన మైదాన ప్రాంతానికి బదిలీకి అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలోని జరిగిన 26 సిఫార్స్ బదిలీల్లో 15 మందికి పైగా ఉపాధ్యాయులు ఏజెన్సీ నుంచి విశాఖ నగరానికి స్థానచలనం పొందారు. పెదబయలు మండలం కుంటూరుపుట్టులో ఎస్జీటీ ఉపాధ్యాయిని విశాఖలోని చినగదిలి మండలానికి సిఫార్సు బదిలీపై వచ్చారు. చింతపల్లి మండలం మండిపల్లి పాఠశాలలో ఎస్జీటీ గాజువాకకు బదిలీ చేసుకున్నారు. అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లోని ఎస్జీటీలు పెందుర్తి మండలానికి బదిలీపై వచ్చారు. ఒకరిద్దరు మాత్రమే పరస్పర బదిలీలతో నగరం నుంచి ఏజెన్సీకి వెళ్లారు. మిగతా వారంతా హెచ్ఆర్ ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోకి మారిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ పాలన త్వరలో సాకారం
[ 05-05-2024]
సంక్షేమ పాలన కూటమి గెలుపుతో త్వరలోనే సాకారమవుతుందని పాడేరు అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. జి.మాడుగుల మండల కేంద్రంలో తెదేపా కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. -
కూటమి బలం చాటుదాం
[ 05-05-2024]
-
డాక్టర్ జగన్మోసంరెడ్డి
[ 05-05-2024]
అర్థ రూపాయి ఖర్చుపెట్టి రూ. 500తో ప్రచారం చేసుకుంటారు జగన్. వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు, ఫ్యామిలీ ఫిజీషియన్, ఆరోగ్య సురక్ష అంటూ ప్రచార ఆర్భాటం చేసుకున్నారే తప్ప వాటితో రోగులకు మేలు జరిగిందే లేదు. -
అనంత బాబు ఆటలు సాగనీయం
[ 05-05-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని రాష్ట్రం బాగుపడాలంటే తెదేపా ప్రభుత్వం రావాల్సిందే అని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
ఓటేయాలంటే పాట్లెన్నో..!
[ 05-05-2024]
ఏళ్లు గడుస్తున్నా మన్యంవాసులకు రవాణా కష్టాలు గట్టెక్కడం లేదు. పాడేరు డివిజన్ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు నేటికీ ఓటేయాలంటే కిలోమీటర్ల దూరం నడక సాగించాల్సిన పరిస్థితి ఉంది. -
ఫెర్రో.. ‘జగన్ దెబ్బకు’ మొర్రో!
[ 05-05-2024]
ఫెర్రో పరిశ్రమలు లేకపోతే దేశానికి ప్రగతి ఉండదు. చంద్రయాన్-3 ప్రయోగానికి సైతం ఫెర్రో ఉత్పత్తులనే వినియోగించారు. ఈ పరిశ్రమకు ప్రధాన ముడిసరకు విద్యుత్తు. ఏపీలో దీనిని భారం చేశారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
[ 05-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై అరుణ్కిరణ్ పేర్కొన్నారు. శనివారం చింతపల్లిలో సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ, స్థానిక పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. -
పోలింగు కేంద్రాల్లో సమస్యలుంటే చెప్పండి
[ 05-05-2024]
ఎన్నికల విధులు నిర్వహించన్ను అధికారులు, సిబ్బంది ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై పూర్తిస్తాయిలో శిక్షణ తీసుకుని అవగాహన కలిగి ఉండాలని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్.ప్రశాంత్కుమార్ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో పరిశ్రమలు పోయాయ్
[ 05-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని, ఉన్నవి పోయాయని సినీ హీరో నారా రోహిత్ ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. -
కొత్తగా 30 వేల మందికి పింఛన్లు
[ 05-05-2024]
‘జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 50 ఏళ్ల వయస్సుండే ప్రతి గిరిజనుడికి జులై నుంచి రూ.నాలుగు వేల పింఛను అందుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల బోనస్ రూ. మూడు వేలు అదనం. ఈ నిర్ణయంతో రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పటికే 40 వేల మందికి పింఛన్లు అందుతున్నాయి. -
మూడో రోజూ అవే అవస్థలు..
[ 05-05-2024]
మారేడుమిల్లి మండలంతోపాటు, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతానికి చెందిన పింఛనుదారులు నగదు కోసం మారేడుమిల్లిలోని యూనియన్ బ్యాంకుకు పోటెత్తడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది.
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ