భవనాలు పూర్తికావు..సేవలు అందవు
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి.
వెలగపల్లి వద్ద నిలిచిపోయిన సచివాలయ భవనం
దేవీపట్నం, న్యూస్టుడే : పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిర్మాణాలు పూర్తికాక స్థానికులకు అవసరమైన సేవలు అందడంలేదు.
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని దేవీపట్నం, మంటూరు, కొండమొదలు ఆర్అండ్ఆర్ పునరావాస కాలనీలో సచివాలయం భవనాలు నేటికీ ప్రారంభించలేదు. ప్రస్తుతం తాత్కాలికంగా కాలనీలో ఉన్న ప్రభుత్వ భవనాల్లోనే సచివాలయాలు ఏర్పాటుచేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన దేవీపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెలగపల్లి వద్ద నిర్మించడానికి ప్రభుత్వం అప్పట్లో పనులు ప్రారంభించింది. గుత్తేదారునికి సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఆ తరువాత అంచనాలు పెరగడంతో గుత్తేదారు ముందుకు రాలేదు. దీంతో ప్రస్తుతం భవన నిర్మాణం చుట్టూ భారీగా తుప్పలు పెరిగిపోయాయి. ఈ పీహెచ్సీ నిర్మాణం పూర్తయితే యర్రమెట్ల నుంచి రాయవరం వరకు పలు గ్రామాల గిరిజనులకు వైద్యసేవలు అందుబాటులో ఉండేవి. ఇప్పటికైనా పీహెచ్సీ నిర్మాణం పూర్తి చేయాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ పాలన త్వరలో సాకారం
[ 05-05-2024]
సంక్షేమ పాలన కూటమి గెలుపుతో త్వరలోనే సాకారమవుతుందని పాడేరు అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. జి.మాడుగుల మండల కేంద్రంలో తెదేపా కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. -
కూటమి బలం చాటుదాం
[ 05-05-2024]
-
డాక్టర్ జగన్మోసంరెడ్డి
[ 05-05-2024]
అర్థ రూపాయి ఖర్చుపెట్టి రూ. 500తో ప్రచారం చేసుకుంటారు జగన్. వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు, ఫ్యామిలీ ఫిజీషియన్, ఆరోగ్య సురక్ష అంటూ ప్రచార ఆర్భాటం చేసుకున్నారే తప్ప వాటితో రోగులకు మేలు జరిగిందే లేదు. -
అనంత బాబు ఆటలు సాగనీయం
[ 05-05-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని రాష్ట్రం బాగుపడాలంటే తెదేపా ప్రభుత్వం రావాల్సిందే అని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
ఓటేయాలంటే పాట్లెన్నో..!
[ 05-05-2024]
ఏళ్లు గడుస్తున్నా మన్యంవాసులకు రవాణా కష్టాలు గట్టెక్కడం లేదు. పాడేరు డివిజన్ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు నేటికీ ఓటేయాలంటే కిలోమీటర్ల దూరం నడక సాగించాల్సిన పరిస్థితి ఉంది. -
ఫెర్రో.. ‘జగన్ దెబ్బకు’ మొర్రో!
[ 05-05-2024]
ఫెర్రో పరిశ్రమలు లేకపోతే దేశానికి ప్రగతి ఉండదు. చంద్రయాన్-3 ప్రయోగానికి సైతం ఫెర్రో ఉత్పత్తులనే వినియోగించారు. ఈ పరిశ్రమకు ప్రధాన ముడిసరకు విద్యుత్తు. ఏపీలో దీనిని భారం చేశారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
[ 05-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై అరుణ్కిరణ్ పేర్కొన్నారు. శనివారం చింతపల్లిలో సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ, స్థానిక పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. -
పోలింగు కేంద్రాల్లో సమస్యలుంటే చెప్పండి
[ 05-05-2024]
ఎన్నికల విధులు నిర్వహించన్ను అధికారులు, సిబ్బంది ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై పూర్తిస్తాయిలో శిక్షణ తీసుకుని అవగాహన కలిగి ఉండాలని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్.ప్రశాంత్కుమార్ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో పరిశ్రమలు పోయాయ్
[ 05-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని, ఉన్నవి పోయాయని సినీ హీరో నారా రోహిత్ ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. -
కొత్తగా 30 వేల మందికి పింఛన్లు
[ 05-05-2024]
‘జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 50 ఏళ్ల వయస్సుండే ప్రతి గిరిజనుడికి జులై నుంచి రూ.నాలుగు వేల పింఛను అందుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల బోనస్ రూ. మూడు వేలు అదనం. ఈ నిర్ణయంతో రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పటికే 40 వేల మందికి పింఛన్లు అందుతున్నాయి. -
మూడో రోజూ అవే అవస్థలు..
[ 05-05-2024]
మారేడుమిల్లి మండలంతోపాటు, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతానికి చెందిన పింఛనుదారులు నగదు కోసం మారేడుమిల్లిలోని యూనియన్ బ్యాంకుకు పోటెత్తడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?