ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
టేకుబాకలో ఇంటింటి ప్రచారం చేస్తున్న కూటమి నాయకులు
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే: తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. గురువారం చింతపల్లి ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రచార రథాలకు పూజలు నిర్వహించి, ప్రచారం ప్రారంభించారు. గిడ్డి ఈశ్వరిని గెలిపిస్తే అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపుతామని తెలిపారు. నాయకులు ఆనంద్, ముక్కల రమేష్, పండు, అబ్బాయ్నాయుడు, లక్ష్మణ్, రాము తదితరులు పాల్గొన్నారు.
కొయ్యూరు, న్యూస్టుడే: అరకు పార్లమెంట్, పాడేరు అసెంబ్లీ అభ్యర్థులు కొత్తపల్లి గీత, గిడ్డి ఈశ్వరిలను గెలిపించాలని తెదేపా మండల ప్రధాన కార్యదర్శి టి.దొరబాబు కోరారు. తెదేపా నేతలు ఎం.సత్తిబాబు, రాంబాబుతో కలిసి కొయ్యూరు కొండపై వెలసిన దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొయ్యూరు, మర్రివాడ పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు.
హుకుంపేట, న్యూస్టుడే: అరకు నియోజకవర్గంలో అభివృద్ధి సాధించాలంటే కూటమి బలపరిచిన నాయకుడిని గెలిపించాలని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మత్స్యకొండబాబు పేర్కొన్నారు. మండల కేంద్రంలో తెదేపా, భాజపా, జనసేన నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. వైకాపా ప్రభుత్వంలో యువతకు, కార్మికులకు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెదేపా మండల అధ్యక్షుడు తులసీరావు, లక్ష్మణుడు, భాజపా నాయకులు గాసన్న కొండబాబు, సింహాచలం పాల్గొన్నారు.
కూనవరం, న్యూస్టుడే: రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అవినీతిలో కూరుకుపోయిన వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని తెదేపా మండల అధ్యక్షుడు బరపాటి ప్రకాశరావు అన్నారు. తెదేపా, భాజపా, జనసేన నాయకులు టేకుబాకలో కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోలోని అంశాలను ఓటర్లకు వివరించారు. నేతలు ఎడవల్లి భాస్కరరావు, పొడియం అప్పారావు, సుదర్శనరావు, పాయం వెంకయ్య, జనసేన నాయకులు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టు, న్యూస్టుడే: రాష్ట్రంలో తెదేపా, భాజపా, జనసేన కూటమి గెలుపుతోనే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సమకూరుతాయని తెదేపా డివిజన్ నాయకులు పాండురంగస్వామి అన్నారు. గురువారం ముంచంగిపుట్టు మండలంలోని ఏనుగురాయి, కిలగాడ, కొత్తూరు, గాదెలబురుగు, సజనకోట, కుమ్మరిపుట్టు, సుజనపేట, బీటా, పెదగుడ, గూడమాలిపుట్టు గ్రామాల్లో కూటమి నాయకులు ప్రచారం నిర్వహించారు. భాజపా మండల అధ్యక్షులు లక్ష్మణ్, తెదేపా ఉపాధ్యక్షులు బాబూజీ, భాజపా నేతలు రవికుమార్, వెంకటరమణ, మత్స్యరాజు పాల్గొన్నారు.
చింతపల్లి ముత్యాలమ్మ ఆలయం వద్ద నేతలు
చింతూరు: కూటమి అభ్యర్ధులను గెలిపించాలని మండలంలోని మల్లెతోట, ఉలుమూరులోపాటు పలు గ్రామాల్లో కూటమి నాయకులు గురువారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అరకు పార్లమెంటు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత, మిరియాల శిరీషాదేవిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. నాయకులు ఇల్లా చిన్నారెడ్డి, డీవీఎస్ రవమణారెడ్డి, కట్టం ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎటపాక: పురుషోత్తపట్నంలో ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవిలకు మద్దతుగా తెదేపా నేతలు పుట్టి రమేష్, మువ్వా శ్రీనివాస్, చేకూరి వెంకటరమేష్, విజ్జగిరి రవితేజ తదితరులు ప్రచారం నిర్వహించారు. తెదేపా సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు. తెదేపా, భాజపా నేతలు వల్లభనేని చందు, మోదుగు పెరమయ్య, బొల్లా ప్రసాద్, గోడేటి రవికుమార్, పేరాల వెంకన్న, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చలివేంద్రం ఏర్పాటు
ఎటపాక, న్యూస్టుడే: మండలంలోని త్రిపుర పెంటవీడు పంచాయతీ సీతాపురంలో తెదేపా యూనిట్ ఇన్ఛార్జి బాచినేని మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పార్టీల నాయకులు తెదేపా సీనియర్ నాయకులు కిలారు వెంకటేశ్వరరావు, అరకు పార్లమెంట్ కార్యదర్శి మువ్వా శ్రీనివాస్, తెదేపా మండల అధ్యక్షులు పుట్టి రమేష్బాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు, జనసేన మండల అధ్యక్షులు మారాసు గంగాధర్, భాజపా మండల అధ్యక్షులు మోదుగు పెరమయ్య సమక్షంలో రిబ్బన్ కట్ చేశారు. భాజపా జిల్లా కార్యదర్శి ప్రసాద్, తెదేపా సీనియర్ నాయకులు వెంకన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ పాలన త్వరలో సాకారం
[ 05-05-2024]
సంక్షేమ పాలన కూటమి గెలుపుతో త్వరలోనే సాకారమవుతుందని పాడేరు అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. జి.మాడుగుల మండల కేంద్రంలో తెదేపా కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. -
కూటమి బలం చాటుదాం
[ 05-05-2024]
-
డాక్టర్ జగన్మోసంరెడ్డి
[ 05-05-2024]
అర్థ రూపాయి ఖర్చుపెట్టి రూ. 500తో ప్రచారం చేసుకుంటారు జగన్. వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు, ఫ్యామిలీ ఫిజీషియన్, ఆరోగ్య సురక్ష అంటూ ప్రచార ఆర్భాటం చేసుకున్నారే తప్ప వాటితో రోగులకు మేలు జరిగిందే లేదు. -
అనంత బాబు ఆటలు సాగనీయం
[ 05-05-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని రాష్ట్రం బాగుపడాలంటే తెదేపా ప్రభుత్వం రావాల్సిందే అని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
ఓటేయాలంటే పాట్లెన్నో..!
[ 05-05-2024]
ఏళ్లు గడుస్తున్నా మన్యంవాసులకు రవాణా కష్టాలు గట్టెక్కడం లేదు. పాడేరు డివిజన్ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు నేటికీ ఓటేయాలంటే కిలోమీటర్ల దూరం నడక సాగించాల్సిన పరిస్థితి ఉంది. -
ఫెర్రో.. ‘జగన్ దెబ్బకు’ మొర్రో!
[ 05-05-2024]
ఫెర్రో పరిశ్రమలు లేకపోతే దేశానికి ప్రగతి ఉండదు. చంద్రయాన్-3 ప్రయోగానికి సైతం ఫెర్రో ఉత్పత్తులనే వినియోగించారు. ఈ పరిశ్రమకు ప్రధాన ముడిసరకు విద్యుత్తు. ఏపీలో దీనిని భారం చేశారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
[ 05-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై అరుణ్కిరణ్ పేర్కొన్నారు. శనివారం చింతపల్లిలో సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ, స్థానిక పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. -
పోలింగు కేంద్రాల్లో సమస్యలుంటే చెప్పండి
[ 05-05-2024]
ఎన్నికల విధులు నిర్వహించన్ను అధికారులు, సిబ్బంది ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై పూర్తిస్తాయిలో శిక్షణ తీసుకుని అవగాహన కలిగి ఉండాలని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్.ప్రశాంత్కుమార్ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో పరిశ్రమలు పోయాయ్
[ 05-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని, ఉన్నవి పోయాయని సినీ హీరో నారా రోహిత్ ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. -
కొత్తగా 30 వేల మందికి పింఛన్లు
[ 05-05-2024]
‘జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 50 ఏళ్ల వయస్సుండే ప్రతి గిరిజనుడికి జులై నుంచి రూ.నాలుగు వేల పింఛను అందుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల బోనస్ రూ. మూడు వేలు అదనం. ఈ నిర్ణయంతో రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పటికే 40 వేల మందికి పింఛన్లు అందుతున్నాయి. -
మూడో రోజూ అవే అవస్థలు..
[ 05-05-2024]
మారేడుమిల్లి మండలంతోపాటు, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతానికి చెందిన పింఛనుదారులు నగదు కోసం మారేడుమిల్లిలోని యూనియన్ బ్యాంకుకు పోటెత్తడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది.
తాజా వార్తలు (Latest News)
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’