logo

పర్యటక ప్రాంతాల్లో సందడి

లోయరు సీలేరు ప్రాజెక్టులోని పర్యటక ప్రాంతాలు ఆదివారం సందర్శకులతో కిటకిటలాడాయి. పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు రావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో పర్యటకులు తరలివచ్చారు.

Published : 03 Oct 2022 01:40 IST

పొల్లూరు జలపాతంలో పర్యటకులు

మోతుగూడెం, న్యూస్‌టుడే: లోయరు సీలేరు ప్రాజెక్టులోని పర్యటక ప్రాంతాలు ఆదివారం సందర్శకులతో కిటకిటలాడాయి. పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు రావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో పర్యటకులు తరలివచ్చారు. పొల్లూరు జలపాతం వద్ద రోజంతా జలకాలాడుతూ, ఆటపాటలతో ఆనందంగా గడిపారు. సామూహిక భోజనాలు చేశారు. విద్యార్థులు నృత్యాలు, ఆటపాటలతో సందడి చేశారు.

పోటెత్తిన సందర్శకులు

అనంతగిరి, న్యూస్‌టుడే: దసరా సెలవులు.. వారాంతపు రోజులు (శని, ఆదివారాలు) కావడంతో మన్యంలోని పర్యటక కేంద్రాలను అధిక సంఖ్యలో పర్యటకులు సందర్శించారు. డముకు వ్యూ పాయింట్‌ వద్ద మంచు అందాలను, పకృతి సహజ సిద్ధమైన అందాలను చూసేందుకు తెల్లవారుజాము నుంచే పర్యటకులు అధిక సంఖ్యలో బారులు తీరారు. కాఫీతోటలు, గాలికొండ వ్యూపాయింట్‌ వంటి పర్యటక కేంద్రాల్లో పర్యటకుల తాకిడి అధికంగా కనిపించింది. ఘాట్‌రోడ్డు మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు బారులు తీరాయి.

డముకు వ్యూపాయింట్‌ వద్ద సందడి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని