నేరేడుబందలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
నేరేడుబందలో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు అందజేయాలని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు.
మహిళలతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో
జి.మాడుగుల, న్యూస్టుడే: నేరేడుబందలో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు అందజేయాలని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఈనాడులో గత నెల 28న ‘నేరేడుబంద.. సమస్యలే నిండా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి పీవో స్పందించి జి.మాడుగుల- రావికమతం మండలాల సరిహద్దులోని అత్యంత మారుమూల గిరిజన గ్రామం నేరేడుబందలో గురువారం పర్యటించారు. ఎనిమిది కిలోమీటర్లు కొండలు, గుట్టలు, గెడ్డలు దాటుకుంటూ కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో ఐటీడీఏ పీవో మొట్టమొదటి సారిగా పర్యటించడంతో గిరిజనులు ఆనందం వ్యక్తంచేశారు. నేరేడుబంద గ్రామానికి గ్రావిటీ పథకాన్ని మంజూరు చేస్తామన్నారు. గ్రామంలో గ్రామస్థులు చందాలతో నిర్మించుకున్న పెంకుల షెడ్డును పరిశీలించారు. బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలని గిరిజన సంక్షేమాధికారిని ఆదేశించారు. పాఠశాలకు రేకుల షెడ్డు నిర్మాణానికి రూ. లక్ష మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పెదగరువు, అజేయపురం, జీలుగులోవ గ్రామాలను సందర్శించారు. పెదగరువులో అటవీ హక్కు పత్రాల పంపిణీ, భూ సమస్యలను గ్రామస్థులు పీవో దృష్టికి తీసుకురావడంతో వెంటనే పరిష్కరించాలని రావికమతం తహసీల్దారును ఆదేశించారు. జీలుగులోవలో ఏడు గిరిజన కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి రూ.50 వేల చొప్పున మంజూరు చేశారు. గ్రామానికి విద్యుత్తు సదుపాయం, ఉపాధి పనులు కల్పించాలని గ్రామస్థులు కోరగా తగు చర్యలు చేపట్టాలని రావికమతం ఎంపీడీవోను ఆదేశించారు. జోగంపేట గ్రామానికి జియో టవర్ మంజూరైందని తెలిపారు. బొడ్డుమామిడిలో ఆధార్ శిబిరం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రావికమతం ఎంపీడీవో వెంకన్నబాబు, తహసీల్దారు మహేష్ పాల్గొన్నారు.
గ్రామానికి కాలినడకన చేరుకుంటున్న పీవో గోపాలకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్