logo

మన్యంకొండ జాతర నిర్వహణపై సమీక్ష

ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈనెల 27న చింతూరు మండలంలోని పొల్లూరు జలపాతం వద్ద మన్యంకొండ జాతర నిర్వహించనుంది.

Published : 04 Feb 2023 02:59 IST

సమావేశమైన ఇరు రాష్ట్రాల అధికారులు, జాతర కమిటీల సభ్యులు

మోతుగూడెం, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈనెల 27న చింతూరు మండలంలోని పొల్లూరు జలపాతం వద్ద మన్యంకొండ జాతర నిర్వహించనుంది. దీనిపై ఇరురాష్ట్రాల అధికారులు, జాతర కమిటీల సభ్యులు ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరిలో శుక్రవారం సమావేశమయ్యారు. మల్కాన్‌గిరి సబ్‌ కలెక్టర్‌ అక్షయ్‌ కుమార్‌, ఎమ్మెల్యే అజిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. తదుపరి సమావేశం చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. చింతూరు ఎంపీడీవో రవిబాబు, మోతుగూడెం ఏపీ జెన్‌కో సివిల్‌ ఏడీఈ కొండలరావు, ఏఎస్సై రాజేశ్వరరావు, జాతర కమిటీ సభ్యులు మల్లికార్జున్‌, వరప్రసాద్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని