కలుషితాహారం తిని 39 మందికి అస్వస్థత
అరమ పంచాయతీ మారుమూల గ్రామం నడిమివలసలో కల్తీ ఆహారాన్ని తిని పలువురు అస్వస్థతకు గురైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అరకులోయ ఆసుపత్రికి 12మంది తరలింపు
ప్రాంతీయాసుపత్రిలో బాధిత బాలలకు చికిత్స
డుంబ్రిగుడ, అరకులోయ, న్యూస్టుడే: అరమ పంచాయతీ మారుమూల గ్రామం నడిమివలసలో కల్తీ ఆహారాన్ని తిని పలువురు అస్వస్థతకు గురైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఓ గిరిజనుడి ఇంట శనివారం సాయంత్రం జరిగిన శుభకార్యానికి విందు ఏర్పాటు చేశారు. మిగిలిన ఆహారాన్ని ఆదివారం ఉదయం తిన్న వారంతా ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు, తల బరువు ఎక్కడం, కాళ్లు చేతులు పీకడం వంటి లక్షణాలతో మంచాన పడ్డారు. ఇలా 39 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. బాధిత కుటుంబీకుల సమాచారం మేరకు వైద్య సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం గ్రామానికి చేరుకుని పరీక్షలు నిర్వహించారు. వంతల సూచన (9), కెవిల్ (4), శామ్యూల్ (6), ఇస్మాయిల్ (2), ఎలిషా (4), ఇషాక్ (9), యాకోబు (6), జయరాం (5) చిన్నారులతో పాటు మరో నలుగురు పెద్దలు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో 108 వాహనంలో అరకులోయ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన వారికి గ్రామంలోనే వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన బాధితులను సీపీఎం నాయకులు కిల్లో సురేంద్ర, రామారావు తదితరులు పరామర్శించారు.
నడిమివలసలో విచారణ చేస్తున్న అధికారులు
* ఇన్ఛార్జి తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీవో నగేష్, వైద్యాధికారిణి ప్రేమ, సంబంధిత అధికారులు ఆ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామంలో తాగునీటి వనరులను ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ మహేష్, సిబ్బంది పరీక్షించారు. ఇక్కడ గ్రావిటీ పథకం ద్వారా నీరందుతోంది. ఏటా వేసవికి నెల రోజుల ముందే చుక్క నీరందని పరిస్థితి ఏర్పడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక పొలాల్లోని ఊట నీటితో దాహం తీర్చుకోవాల్సి వస్తోందని, అనారోగ్యంతో పడుతున్నామని అధికారులకు మొరపెట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే