చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు.
సాగునీరందక రైతుల అవస్థలు
శరభన్నపాలెం సమీపంలో బాగుపడని చెక్డ్యామ్
కొయ్యూరు, న్యూస్టుడే: గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పడం తప్ప సాగు నీరందించడంలో వైకాపా విఫలమైందని రైతులు మండిపడుతున్నారు.
కొయ్యూరు మండలంలో 128 చెక్డ్యాంలు, కించెవానిపాలెం, లుబ్బుర్తి, చుట్టుబంద సమీప తొణుకులగెడ్డ జలాశయాలున్నాయి. వీటి పరిధిలో 15 వేల ఎకరాల్లో భూములు సాగవుతున్నాయి. మంప, మర్రివాడ, బూదరాళ్ల, శరభన్నపాలెం, మఠంభీమవరం, కొమ్మిక తదితర పంచాయతీల్లో సుమారు 50 చెక్డ్యామ్లు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని బాగు చేయాలని ప్రభుత్వానికి మొరపెడుతున్నా ఫలితం లేకపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఏడు వేల ఎకరాల్లో పొలాలకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. మర్రివాడ- దొడ్డవరం మధ్యలోని చెక్డ్యాంకు సంబంధించి సిమెంట్ దోనె గతేడాది కూలిపోవడంతో ఖరీఫ్లో సైతం పంటలు పండించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి మరమ్మతులు చేపట్టి ఉంటే రెండు పంటలకు ఉపయోగపడేది. కించెవానిపాలెం జలాశయం మరమ్మతులకు రూ.1.70 కోట్ల నిధులు మంజూరయ్యాయి. చేసిన కొంత పనులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో మిగిలిన పనులు నిలిచిపోయాయి. లుబ్బుర్తి జలాశయం మరమ్మతులు దాదాపు పూర్తయినా బిల్లులు ఇవ్వలేదు. చుట్టుబంద సమీపంలోని తొణుకుల గెడ్డ జలాశయం గేటు, కాలువల మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆ ప్రాంతంలోని వందలాది మంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని బాగు చేయించాలని ఐటీడీఏ పీవో, ప్రజాప్రతినిధులకు మొరపెట్టినా ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖరీఫ్ ప్రారంభంలోగా మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదించాం
కొయ్యూరు మండలంలో 40 చెక్డ్యామ్లు మరమ్మతులకు గురయ్యాయని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. నిధులు విడుదల కాగానే పనులు చేయిస్తాం. కించెవానిపాలెం, లుబ్బుర్తి జలాశయాల మరమ్మతులకు నిధులు మంజూరైతే పనులు కొంతమేర చేయించారు. ఇటీవల ఐదు చెక్డ్యామ్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి.
రామకృష్ణ, జేఈ, ఎస్ఎంఐ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
జగన్ను ఇంటికి పంపితేనే మన్యం అభివృద్ధి
[ 04-05-2024]
అధ్వాన పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎద్దేవా చేశారు. -
జగనన్న కక్ష.. అవ్వాతాతలకు శిక్ష
[ 04-05-2024]
పింఛను సొమ్ము సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేసే అవకాశం ఉన్నా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులను బలిపశువులను చేసింది. -
వైకాపా పతనం ఖాయం
[ 04-05-2024]
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర పేర్కొన్నారు. -
వైకాపా వాహనం స్వాధీనం
[ 04-05-2024]
అనుమతులు లేకుండా వైకాపా ప్రచార సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి వెంకటరావు తెలిపారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 04-05-2024]
దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
ఉద్యోగాలిప్పిస్తామని టోకరా
[ 04-05-2024]
ఉద్యోగాలిప్పిస్తామని గిరిజన యువతను ఇద్దరు మహిళలు మోసం చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
‘జగన్కు ఒక్క అవకాశమిచ్చి అందరం మోసపోయాం’
[ 04-05-2024]
‘గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చి అందరం మోసపోయాం. ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదు. సంక్షేమంలో ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 04-05-2024]
ఎలమంచిలిలోని దిమిలిరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్న నందమూరి బాలకృష్ణ సభకు తెదేపా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కూడలిని జెండాలతో అందంగా తయారు చేశారు. -
కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా
[ 04-05-2024]
కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఆ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సతక బుల్లిబాబు అన్నారు. మంప, రేవళ్లు పంచాయతీల్లోని గ్రామాల్లో శుక్రవారం సీపీఐ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
జగనన్నా.. ఏమిటీ పింఛన్ వెతలు..
[ 04-05-2024]
పింఛన్లకోసం బ్యాంకులకు వచ్చిన వృద్ధులకు రెండో రోజు కష్టాలు తప్పలేదు. వీఆర్పురం మండలం రేఖపల్లిలో బ్యాంకు వద్ద రేఖపల్లి, జీడిగుప్పల పీహెచ్సీల వైద్యులు శిబిరం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM