ఉక్కపోతతో విలవిల
అద్దె భవనాలకు ఏటా అద్దె రూపంలో రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. అద్దె ఇళ్లలో ఇరుకు గదులతో గాలి, వెలుతురు అందడం లేదు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల అవస్థలు
రావికమతం (చోడవరం), న్యూస్టుడే
అద్దె భవనాలకు ఏటా అద్దె రూపంలో రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. అద్దె ఇళ్లలో ఇరుకు గదులతో గాలి, వెలుతురు అందడం లేదు. తక్కువ అద్దె చెల్లిస్తుండంతో విద్యుత్తు సౌకర్యం ఉన్నప్పటికీ ఫ్యాన్లు వేయవద్దని, విద్యుత్తును ఎక్కువగా వాడవద్దని ఇంటి యజమానులు స్పష్టం చేస్తున్నారు. దీంతో చిన్నారులను వరండాల్లో కూర్చోబెడుతున్నారు.
ఈ ఏడాది వేసవిలో మునుపెన్నడూ లేనంతగా ఎండలు మండుతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి జనం అల్లాడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా కేంద్రాల్లో విద్యుత్తు సౌకర్యం లేకపోవడం, ఉన్నచోట బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచి ఫ్యాన్లు తిరగడం లేదు. సామాజిక భవనాలు, అద్దె ఇళ్లలో గాలి, వెలుతురు సరిగ్గా అందక చిన్నారులు విలవిల్లాడుతున్నారు.
* రావికమతం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 234 కేంద్రాలున్నాయి. నెలకు రూ.1.2 లక్షల వరకు విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. 2019 నుంచి కార్యకర్తలు బిల్లులు చెల్లిస్తున్నారు. 2021 జనవరి నుంచి ప్రభుత్వం కార్యకర్తలకు విద్యుత్తు బిల్లుల డబ్బులు ఇవ్వడం లేదు. నెల నెలా విద్యుత్తు బిల్లులు చెల్లించి రసీదులు ఐసీడీఎస్ కార్యాలయంలో ఇస్తున్నా.. బిల్లులు పెట్టడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. రావికమతం ఐసీడీఎస్ ప్రాజెక్టులోనే 25 నెలలుగా సుమారు రూ.25 లక్షల వరకు విద్యుత్తు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
శిథిలావస్థలో అంగన్వాడీ భవనం
* జిల్లాలో పది ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా.. వాటి పరిధిలో 1,903 కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు సుమారు 47 వేల మంది, మూడేళ్లుపైబడి ఆరేళ్లలోపు వయసున్న చిన్నారులు 22,659 మంది, గర్భిణులు, బాలింతలు 9,963 మంది వరకు ఉన్నారు.
* సొంత భవనాల్లో నడుస్తున్న అన్ని కేంద్రాలకు విద్యుత్తు సౌకర్యం కల్పించారు. గతంలో పంచాయతీ నిధులతో బిల్లులు చెల్లించే వారు. కొన్నేళ్లుగా విద్యుత్తు బిల్లులు చెల్లించలేమని పంచాయతీలు చేతులెత్తేశాయి.
* 2019 నుంచి బిల్లుల చెల్లింపు భారం అంగన్వాడీ కార్యకర్తలపై పడింది. కేటగిరి-2 మీటర్లు కావడంతో నెలనెలా రూ.350 వరకు బిల్లులు వస్తున్నాయి. ఒకవేళ కార్యకర్తలు చెల్లించినా ప్రభుత్వం తిరిగి వారికి చెల్లించడం లేదు. జిల్లావ్యాప్తంగా రూ.లక్షల్లో విద్యుత్తు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
1903 కేంద్రాల్లో 850 చోట్ల సొంత భవనాలున్నాయి. 417 కేంద్రాలు సామాజిక, ప్రభుత్వ భవనాల్లో, 641 కేంద్రాలు అద్దె ఇళ్లలో నడుస్తున్నాయి.
గర్నికంలో అద్దె ఇంట్లో..
సదుపాయాలపై సర్వే చేయిస్తున్నాం
- జి.ఉషారాణి, పీడీ, ఐసీడీఎస్
అంగన్వాడీ కేంద్రాల్లో చాలా వరకు విద్యుత్తు సదుపాయం ఉంది. బిల్లులు గ్రామ పంచాయతీలు చెల్లించాల్సి ఉంది. పంచాయతీలు చెల్లించకుంటే కార్యకర్తలు ఆ బాధ్యత తీసుకుని బిల్లు పెడితే చెల్లిస్తున్నాం. కేంద్రాల్లో సౌకర్యాలపై సచివాలయ సంక్షేమ, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ కార్యకర్తలతో సంయుక్తంగా సర్వే చేయిస్తున్నాం. సర్వే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం