నగదు దోపిడీ.. నిందితుల పట్టివేత
కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి చటువా ప్రాంతంలో ఆంధ్ర రైతుల నుంచి డబ్బు దోపిడీ చేసి నేరంపై ఐదుగురు నిందితులను పోలీసు అధికారులు అరెస్టు చేశారు.
బాధితులు అల్లూరి సీతారామరాజు జిల్లా వాసులు
వెల్లడిస్తున్న పోలీసు అధికారులు, వెనుక ముసుగులో నిందితులు
సిమిలిగుడ, న్యూస్టుడే: కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి చటువా ప్రాంతంలో ఆంధ్ర రైతుల నుంచి డబ్బు దోపిడీ చేసి నేరంపై ఐదుగురు నిందితులను పోలీసు అధికారులు అరెస్టు చేశారు. వీరిలో హోంగార్డులు, సమితి మాజీ సభ్యులు ఉండడం గమనార్హం. గురువారం రాత్రి నందపూర్ ఠాణాలో విలేకరుల సమావేశంలో ఎస్డీపీవో సంజయ్ కుమార్ మహా పాత్ర్ వివరాలు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అంటిపాక గ్రామ రైతులు కె.చిట్టి బాబు, వీసోయి బిమ్దార్ కలసి పవర్ టిల్లర్ కొనుగోలుకు బుధవారం మధ్యాహ్నం కారులో జయపురం బయల్దేరారు. ఎండ తీవ్రంగా ఉండడంతో చట్టువా వద్ద ఆగి విశ్రాంతి తీసుకుంటుండగా.. మరో కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు బెదిరించి వీరి వద్ద ఉన్న రూ.1.15 లక్షల నగదును దోచుకుని పారిపోయారు. దీనిపై బాధితులు పాడువా ఠాణాలో ఫిర్యాదు చేశారు. కొరాపుట్ ఎస్పీ అవినాష్ సొనకార్ ఆదేశాల మేరకు ఎస్డీపీవో సంజయ్ కుమార్ మహా పాత్ర్ నేతృత్వంలో ఎస్ఐలు సవ్యసాచి సత్ప్రతి, ప్రఫుల్ కుమార్ లక్రా, సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. అంతటా గాలించి నిందితులను పట్టుకున్నారు. దోపిడిదారులైన పాడువా ఠాణాలో హోంగార్డులుగా పని చేస్తున్న నీలకంఠ పంగి, డంబ్రు దార్ మజీ, అర్జ్జున్ పంగి, కులర్ సింగ్, సమితి మాజీ సభ్యులు అంతర్జామి గుంట, బిలైజోల గ్రామానికి చెందిన మనిక్ గుంట ఉన్నారు. ఐదుగురినికి అరెస్టు చేసి.. వారు వినియోగించిన కారును, రూ.80 వేల నగదు, 4 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు శుక్రవారం తరలించారు.వీరిలో మాజీ సమితి సభ్యులు అంతర్జామిపై అరకు, డుబ్రిగుడ, రాజమండ్రి, రాయగడతో పాటు వివిధ ఠాణాల్లో గంజాయి కేసులు ఉన్నట్లు ఎస్డీపీవో మహా పాత్ర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిధోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్