మూడో రోజూ అవే అవస్థలు..
మారేడుమిల్లి మండలంతోపాటు, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతానికి చెందిన పింఛనుదారులు నగదు కోసం మారేడుమిల్లిలోని యూనియన్ బ్యాంకుకు పోటెత్తడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది.
రేఖపల్లి బ్యాంకులో పింఛన్దారులు ..
మారేడుమిల్లి, న్యూస్టుడే: మారేడుమిల్లి మండలంతోపాటు, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతానికి చెందిన పింఛనుదారులు నగదు కోసం మారేడుమిల్లిలోని యూనియన్ బ్యాంకుకు పోటెత్తడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది.బ్యాంకు సిబ్బంది కేవలం పింఛన్ల పంపిణీకే పరిమితం కావడంతో ఇతర లావాదేవీలు అన్నీ నిలిచిపోయాయి.
వరరామచంద్రాపురం, న్యూస్టుడే: మండలంలో మూడో రోజు పింఛనుదారుల రద్దీ కొంత తగ్గింది. బ్యాంకులు, ప్రైవేట్ మనీ సర్వీస్ పాయింట్ల వద్ద బారులు తీరారు. బ్యాంకుల వద్ద వచ్చిన వారికి నీడ, తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సర్వీసుల వద్ద మాత్రం ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో పింఛన్దారులు ఇబ్బందులకు గురయ్యారు. రెండు బ్యాంకుల వద్ద రేఖపల్లి, జీడిగుప్ప వైద్య సిబ్బందితో శిబిరాలను కొనసాగించి, 30మందికి ఓఆర్ఎస్ ప్యాకిట్లు, ఇతర మందులు అందించారు.
ఇంటివద్దే పింఛను ఇవ్వండి
పింఛను పొందేందుకు టి.బూరుగుబంద గ్రామం నుంచి రంపచోడవరం వచ్చాను. నడవలేని పరిస్థితిలో ఉన్నా ఎవరూ పింఛను ఇచ్చేందుకు నా వద్దకు రాలేదు. కుటుంబ సభ్యుల సాయంతో బ్యాంకు వచ్చాను. వచ్చే నెలలో ఇంటివద్దనే ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
కారం పరమయ్యదొర, లబ్ధిదారుడు, బూరుగుబంద
- ఈమె పేరు ముర్రం ముత్తమ్మ గత నెలలో సచివాలయం సిబ్బంది ద్వారా పింఛను అందుకున్నారు. ఈ నెలలో బ్యాంకులో నగదు జమయ్యిందని తీసుకోవడానికి వచ్చారు. ఈమెకు ఉన్న ఎస్బీఐ ఖాతాలో నగదు జమకాలేదు. ఏం చేయాలో తెలియక తిరిగి వెళ్లిపోయారు. అటు సచివాలయంలోకి వెళ్లినా సరైన సమాధానం లేదు. చేసేది లేక దిక్కులు చూడాల్సిన పరిస్థితి.
- ఈమె పేరు ముర్రం భద్రమ్మ. పింఛన్ నగదు జమయిందని రూ.మూడు వేలు డ్రా చేశారు. ఆ తర్వాత బ్యాలన్స్ చూస్తే ముందుగా ఉన్న నిల్వ నుంచే తీసుకున్నట్లు కనపడింది. అప్పుడు తెలిసింది. పింఛను నగదు ఖాతాలో జమ కాలేదని గుర్తించారు.
ఎనిమిది కిలోమీటర్ల నడక
మోతుగూడెం, న్యూస్టుడే: మోతుగూడెం యూనియన్ బ్యాంకు రావడానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలకోట గ్రామానికి వాహన సదుపాయం లేదు. దీంతో ఇక్కడి పింఛనుదారులు ఉదయాన్నే బ్యాంకుకు కాలినడకన చేరుకుంటున్నారు. పింఛను తీసుకుని తిరిగి మండుటెండలో ఇళ్లకు బయలుదేరుతున్నారు. శనివారం కుంజా రామయ్య అనే వృద్ధుడు కర్ర సాయంతో నేలకోట నుంచి రాను పోను 8 కి.మీ నడిచి నానా అవస్థలు పడ్డాడు. శుక్రవారం నేలకోటలోని ఓ వృద్ధుడి ఖాతా చింతూరు ఎస్పీబీహెచ్లో ఉంటే ఆ విషయం తెలియక మండుటెండలో నాలుగు కి.మీ నడిచి మోతుగూడెం యూనియన్ బ్యాంకుకు వచ్చాడు. అధికారులు చింతూరు బ్యాంకు అని చెప్పడంతో దేవుడా అంటూ మండుటెండలో తిరిగి నేలకోట తిరుగు ప్రయాణమయ్యాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి స్థానిక పీహెచ్సీ ఆరోగ్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సికెల్సెల్ ఎనీమియాతో గిరి యువతి మృతి
[ 18-05-2024]
సికెల్సెల్ ఎనీమియాతో గిరిజన యువతి మృతి చెందింది. బాధితురాలి కుటుంబసభ్యులు అందించిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం మారుమూల బలపం పంచాయతీ తూరుమామిడి గ్రామానికి చెందిన కోరాబు భూమిక (18) పాడేరు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. -
కర్షకుల కడగండ్లు కనిపించవా ?
[ 18-05-2024]
పెద్దేరు జలాశయం ఆయకట్టు పరిధిలోని రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయకట్టు పరిధిలో ఉన్నా సాగునీటికి కటకట తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాలనీల్లోనే ఉంటున్నారా?
[ 18-05-2024]
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట లబ్ధిదారులు నివాసం ఉంటున్నారా లేదా అన్నది ఆరా తీయాలని గృహనిర్మాణ సంస్థ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. -
వెంకన్న కల్యాణోత్సవాలపై సందిగ్ధం
[ 18-05-2024]
అరకులోయ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఆలయ, ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు స్వామివారి కల్యాణోత్సవాలు శనివారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి