కూటమి విజయభేరి నేడే
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.
తాళ్లపాలెంలో మోదీ భారీ సభ
ముఖ్య అతిథిగా తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే- అనకాపల్లి పట్టణం, కశింకోట: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. కశింకోట మండలం తాళ్లపాలెం సమీపంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 80 ఎకరాల లేఅవుట్లో సభను నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు మోదీ ఇక్కడికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగిస్తారు. జిల్లాలో ఇప్పటికే తెదేపా, జనసేన అధినేతలు రెండు సార్లు పర్యటించారు. సోమవారం ప్రధానమంత్రి మోదీ పర్యటన నేపథ్యంలో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు 2 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని భాజపా నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు జోరుగా చేస్తున్నారు. ప్రధాని కోసం లేఅవుట్లోనే మూడు హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. చంద్రబాబుకు మరో హెలిప్యాడ్ నిర్మించారు. సుమారు 3 వేల మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. ఎస్పీజీ అధికారులు సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీంచారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్డబ్ల్యూ), బాంబు స్క్వాడ్, జాగిలాలతో హెలిప్యాడ్, సభావేదిక వద్ద తనిఖీలు చేపట్టారు.
సభావేదిక ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కూటమి నేతలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సికెల్సెల్ ఎనీమియాతో గిరి యువతి మృతి
[ 18-05-2024]
సికెల్సెల్ ఎనీమియాతో గిరిజన యువతి మృతి చెందింది. బాధితురాలి కుటుంబసభ్యులు అందించిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం మారుమూల బలపం పంచాయతీ తూరుమామిడి గ్రామానికి చెందిన కోరాబు భూమిక (18) పాడేరు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. -
కర్షకుల కడగండ్లు కనిపించవా ?
[ 18-05-2024]
పెద్దేరు జలాశయం ఆయకట్టు పరిధిలోని రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయకట్టు పరిధిలో ఉన్నా సాగునీటికి కటకట తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాలనీల్లోనే ఉంటున్నారా?
[ 18-05-2024]
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట లబ్ధిదారులు నివాసం ఉంటున్నారా లేదా అన్నది ఆరా తీయాలని గృహనిర్మాణ సంస్థ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. -
వెంకన్న కల్యాణోత్సవాలపై సందిగ్ధం
[ 18-05-2024]
అరకులోయ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఆలయ, ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు స్వామివారి కల్యాణోత్సవాలు శనివారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే