చంద్రమోదీయం.. జనామోదం
ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు.
కూటమి కలయికతో వెల్లువెత్తిన ఉత్సాహం
మీ భవితకు నాదీ భరోసా
ఈనాడు అనకాపల్లి: న్యూస్టుడే, అనకాపల్లి/ పట్టణం,గ్రామీణం, కశింకోట, కొత్తూరు, ఎలమంచిలి
సభలో ప్రధాని మోదీ
ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు భారీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో సభా ప్రాంగణం ప్రధాని మోదీ రాకకు గంటముందే నిండిపోయింది. ఇంకా వేలాదిమంది రోడ్లపైనే ఉండిపోవడంతో వారందరినీ సభాప్రాంగణం వెలుపల ఉన్న ఖాళీ స్థలం లోకి అనుమతించాలని సీఎం రమేశ్ పోలీసులను కోరారు. వారంతా మోదీ ప్రసంగాన్ని బయట ఏర్పాటుచేసిన ఎల్ఈడీ తెరలపై తిలకించారు. పార్టీ జెండాలు పట్టుకుని దండులా కదలివచ్చిన మహిళలను చూసి ప్రధాని రెట్టింపు ఉత్సాహంతో ప్రసంగించారు. సభ ప్రారంభమైనా అభిమానులు వస్తూనే ఉన్నారు. పరిసర గ్రామాల నుంచి రైతులు కాలినడకన ప్రాంగణానికి చేరుకున్నారు. చంటి బిడ్డలను భుజాన వేసుకుని తల్లులు, యువత పెద్దసంఖ్యలో తరలిరావడంతో జాతీయ రహదారి సైతం కిటకిటలాడింది.
ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు
బిడ్డల భవిష్యత్ అంధకారంలోకి..: గీత
కొత్తపల్లి గీతకు మోదీ దీవెనలు
జగన్ పాలనలో రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టారని అరుకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. బిడ్డల భవిష్యత్ బాగుండాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. వైకాపా అభ్యర్థులను చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. అవినీతి పాలన అంతం చేయాలన్నారు. జగన్ పాలనలో దాడులు పెరిగాయన్నారు. రైతుల భూములకు, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సైకో ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని గీత అన్నారు. జగన్ను జైలుకు పంపాలన్నారు. రాష్ట్ర భవిష్యత్ను ఆలోచించి మహిళలంతా ఆశీర్వదించి చంద్రబాబును ముఖ్యమంత్రి, మోదీని ప్రధానిని చేయాలని కోరారు.
యువత చంద్రబాబు, పవన్ల, చిత్రాలను ద్విచక్ర వాహనాలపై ఊరేగించుకుంటూ తీసుకెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. వాహనాలు తిరిగి వెళ్లేటప్పుడు ట్రాఫిక్ ఆగకుండా వాహనాలన్నీ కార్యకర్తలు ఒక వరుసలో పెట్టించారు. జాతీయ రహదారి పొడవునా ఆటోలు పసుపు రైలులా కనువిందు చేశాయి.
మూడు పార్టీల కలయికతో ఉత్తరాంధ్ర ప్రగతి
ప్రధానితో తెదేపా అధినేత ముచ్చట్లు
‘యువత సైకిల్ ఎక్కాలి. భాజపా, తెదేపా, జనసేన జెండాలు కట్టుకోవాలి. ఒక చేత్తో గాజు గ్లాసు పట్టుకొని, కమలం పువ్వును సైకిల్ మీద ఉంచి వారం రోజుల పాటు పనిచేయాలని’ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. మూడు పార్టీలు కలిశాక అన్ని స్థానాలను స్వీప్ చేస్తున్నాం. అన్ని చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు, మూడు పార్టీల కలయికతో ఉత్తరాంధ్రలో ఊపు కనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర కూటమి అభ్యర్థులను ఎందుకు గెలిపించాలో వివరించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పరిచయం చేసి వారి బలాబలాలను తెలియజేస్తూ, వారు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతారో చెప్పారు. టికెట్లు దక్కని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైకాపా అధినేత జగన్ సిద్ధం సభల్లో తమ అభ్యర్థుల గురించి సౌమ్యుడు, మంచోడు అని చెప్పారే గాని వారు ఏంచేస్తారో చెప్పలేకపోయారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు మాత్రం కూటమి అభ్యర్థులు ఏం చేస్తారో చెప్పి ప్రజల్లో నమ్మకం పెంచారు.
రమేశ్ను గెలిపించండి
ఆకట్టుకున్న స్వాగత ద్వారం
భాజపా రంగుల తలపాగాలు ధరించిన కార్యకర్తలు
యువత కూటమి వెంటే..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
కాంబోడియాలో విశాఖ యువత నరకయాతన
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
రంపచోడవరంలో పుష్ప-2 చిత్రీకరణ
[ 19-05-2024]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప-2 సినిమాను శనివారం రంపచోడవరం మార్కెట్లో చిత్రీకరించారు. -
జడిగుడ జలజలా.. జోలాపుట్టు వెలవెల!
[ 19-05-2024]
ముంచంగిపుట్టు మండలంలోని బాబుసాల పంచాయతీ జడిగుడ సమీపంలో జలపాతం మండువేసవిలోనూ జాలువారుతూ కళకళలాడుతోంది. -
ఆన్లైన్లో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
[ 19-05-2024]
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ జవాబు పత్రాల మూల్యాంకనం ఆన్లైన్ విధానంలో చేపట్టనున్నారు. -
సరిహద్దులు దాటని అభివృద్ధి
[ 19-05-2024]
ఓట్ల పండగ ముగిసి త్వరలో రానున్న ప్రభుత్వం పగ్గాలు అందుకోబోతోంది. -
ప్రాణాంతక వ్యాధులపై ఇంటింటి సర్వే
[ 19-05-2024]
ప్రాణాంతక వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్