Indrakiladri: దుర్గగుడి అభివృద్ధికి ప్రణాళికలు ఎన్నిసార్లు రూపొందిస్తారో?
‘విజయవాడ దుర్గగుడి అభివృద్ధి కోసం రూ.70 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చాలా ప్రణాళికలే రూపొందించారు.
రూ.70 కోట్లు వచ్చినా.. కాలయాపన
ఈనాడు, అమరావతి: ‘విజయవాడ దుర్గగుడి అభివృద్ధి కోసం రూ.70 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చాలా ప్రణాళికలే రూపొందించారు. కానీ.. ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయడంలో తీవ్ర జాప్యం అయ్యింది. అయినప్పటికీ ఆలయ నిధులతో కొన్ని పనులు చేపట్టారు. ప్రధానంగా అన్నదానం, ప్రసాదం పోటు భవనాల కోసం నమూనాలు సిద్ధం చేయడం, స్థలం చదును చేయడం వంటివి చేపట్టారు. దసరా వచ్చేయడంతో రాళ్లు జారిపడకుండా ఉండేందుకు.. రాక్ మిటిగేషన్ పనులు మాత్రం పూర్తిచేశారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాలేదు. ఈలోగా కొత్తగా వచ్చిన దేవాదాయశాఖ మంత్రి కొన్ని పనుల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంతో ఉత్సాహంగా చేపట్టిన పనులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్లను మంజూరు చేసింది. మరోసారి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశాకే.. పనులు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది.’
గత దశాబ్దకాలంలో దుర్గగుడిలో బృహత్తర ప్రణాళిక నమూనాల కోసమే.. రూ.లక్షలు ఖర్చు చేశారు. ఈవో మారగానే.. బృహత్తర ప్రణాళిక అంటూ ఓ కొత్త సంస్థను తీసుకొచ్చి నమూనాలు సిద్ధం చేయిస్తుంటారు. ఇలా ఇప్పటివరకూ దుర్గగుడి అభివృద్ధి కోసం కనీసం ఓ ఐదారు బృహత్తర ప్రణాళికలు గత పదేళ్లలోనే సిద్ధం చేశారు. కానీ.. ఒక్కటి కూడా చేపట్టింది లేదు. కేవలం నమూనాలు తయారుచేసే సంస్థకు డబ్బులు చెల్లించేందుకే.. ఈ హడావుడి అన్నట్టుగా వ్యవహారం కొనసాగింది.ప్రస్తుతం దుర్గగుడిలో అన్నదాన భవనం, ప్రసాదంపోటు.. పనుల నిర్మాణం మళ్లీ మొదటి కొచ్చింది.
నిధులు లేక అప్పుడు.. ఉన్నా ఇప్పుడు..
రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కోసం రూ.70 కోట్లు ఇస్తామని ప్రకటించిన తర్వాత.. వాటితో పలు నిర్మాణాలు చేపట్టాలని రెండేళ్ల కిందట నిర్ణయించారు. కానీ.. ప్రభుత్వం ఇస్తామన్న డబ్బులు విడుదల చేయకపోవడంతో.. చాలాకాలం ఈ పనులు తీవ్ర జాప్యమయ్యాయి. తర్వాత ఆలయ నిధులతో చేపట్టాలని టెండర్లు పిలిచారు. కనకదుర్గ పైవంతెన కిందన నిర్మించాలనుకున్న కేశఖండనశాలను మాత్రం పూర్తిగా వాయిదా వేశారు. అన్నదానం, ప్రసాదంపోటు భవనాలను మహామండపానికి పక్కన నిర్మించాలని నమూనాలు రూపొందించారు. స్థలం కూడా చదును చేశారు. పునాదుల పని మొదలైన సమయంలో.. ఈ నిర్మాణాలను ఆపేశారు. ఆ తర్వాత దసరా వేడుకలు రావడంతో కొంతకాలం ఈ నిర్మాణాలను పక్కన పెట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న రూ.70 కోట్లను దసరాకు ముందే విడుదల చేసింది. ఆలయంలో పనులు చేపట్టి ఆ బిల్లులు పెట్టుకుని.. డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం దసరా వెళ్లి.. నెలన్నర గడుస్తున్నా అన్నదానం, ప్రసాదంపోటు నిర్మాణాల ఊసే ఎత్తడం లేదు.
ప్రతిసారీ ఇదే తీరు..
ప్రభుత్వం ఇస్తానన్న నిధులతో కొండ రాళ్లు జారి పడకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం, శివాలయ ఆధునికీకరణ, అన్నదానం భవన నిర్మాణం, టోల్ప్లాజా, ప్రసాదాల తయారీ భవనం, కల్యాణమండపాలు, కేశఖండనశాల ఇలా పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వీటిలో కొన్నింటినే దుర్గగుడి సొంత డబ్బులతో ఆరంభించారు. ఈలోపు దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న వెలంపల్లి స్థానంలో కొత్తగా కొట్టు సత్యనారాయణ వచ్చారు. ఆలయ నిర్మాణాలపై కొట్టు ప్రత్యేక దృష్టి పెట్టారు. వీటిలో చాలా లోపాలున్నాయని, ప్రణాళికలు మార్చాలంటూ ఆదేశించారు. ప్రసాదంపోటు, అన్నదాన భవనం నిర్మాణాలు ఆగిపోయాయి. ప్రస్తుతం మరో సంస్థను తెచ్చి ఈ పనులన్నింటికీ కలిపి బృహత్తర ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నారు. గతంలోనూ రూ.100 కోట్లతో బృహత్తర ప్రణాళిక అంటూ రూ.10లక్షల వరకూ ఖర్చు పెట్టి నమూనాలు సిద్ధం చేశారు. ఆ తర్వాత ఈవో మారారు. ఆ ప్రణాళికలు పక్కకెళ్లిపోయాయి. ప్రస్తుతం మరోసారి అదే పొరపాటు చేస్తున్నారు. ఈ ఫలితం లేని నమూనాలపై దృష్టిసారించడం ఆపి.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డబ్బులను త్వరగా వాడుకుని.. ఆలయానికి అవసరమైన అన్నదానం, ప్రసాదం పోటు భవనాలను నిర్మించుకోవడంపై ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ.. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు: పవన్
[ 04-05-2024]
వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఎన్నారైల ఎన్నికల ప్రచారం
[ 04-05-2024]
అవనిగడ్డ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలకు విజయం చేకూర్చాలని ప్రచారం నిర్వహించారు. -
ఓడినా బలపడ్డాం.. ఐదు కోట్ల మందికి ధైర్యం నూరిపోశాం: పవన్ కల్యాణ్
[ 04-05-2024]
ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. -
జగన్కు ప్యాలెస్లు.. పేదలకు పూరిళ్లా?: చంద్రబాబు
[ 04-05-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. -
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయాల్సిన అవసరమేంటి?: పవన్
[ 04-05-2024]
జగన్ది డబుల్ డి (దాడులు, దోపిడీలు) ప్రభుత్వమని జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. -
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
[ 04-05-2024]
ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ సేవలకే పరిమితమైన పోలీస్శాఖ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా తీరు మార్చుకోవడం లేదు. -
జగన్.. ‘పైసా’చికానందం..!
[ 04-05-2024]
‘ఇది అత్యంత దారుణం.. పండుటాకులతో జగన్ పైశాచిక క్రీడ ఆడుతున్నారు. వృద్ధులంతా ఎండలో నరకం అనుభవించాలని.. తమ బాధకు కారణం.. వాలంటీర్లు లేకపోవడమేనని వాళ్లు భావించాలనేదే.. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. -
బ్యాలట్ కాదు.. బుల్లెట్
[ 04-05-2024]
ఒక పూటలో తినే కూరగాయల్నే ఏరి ఏరి కొంటాం.. మరి అయిదేళ్లకోసారి వేసే ఓటు ఆచితూచి వేయలేమా..! సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. -
సహకారానికి జగన్ కత్తెర
[ 04-05-2024]
సహకార చట్టం ప్రకారం.. సంఘానికి నిర్ధరిత కాలవ్యవధిలో ప్రత్యేక ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. -
జగన్ జమాన.. జనం భయాన!
[ 04-05-2024]
ప్రశాంతంగా కుటుంబంతో పార్కుకు వెళ్లాలంటే భయం.. పద్మావతి ఘాట్కో... కృష్ణవేణి ఘాట్కో వెళ్లి కొద్దిసేపు సేదదీరాలన్నా భయమే... నిర్మానుష్యంగా.. చీకటిగా ఉన్న రోడ్లపై వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే...ఎటువైపు నుంచి బ్లేడ్, గంజాయి బ్యాచ్లు దాడి చేస్తాయో తెలీదు. -
పోలీసుపై కొడాలి నాని ప్రధాన అనుచరుడి అరాచకం
[ 04-05-2024]
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడైన కసుకుర్తి జనార్దన్ (గుడ్లవల్లేరు బాబ్జి) ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆటోనగర్పై పగ.. శ్రామికులకు సెగ
[ 04-05-2024]
ఆసియాలోనే పెద్దదైన బెజవాడ ఆటోనగర్ పారిశ్రామికవాడ నేడు అనేక సమస్యలతో సతమతమౌతోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పట్టించుకోవడం మానేసింది. -
వంశీ, నానీ.. ‘దారి’ మరిచారేం?
[ 04-05-2024]
గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలకు ఎంతగానో ఉపకరించే కీలక రహదారి అభివృద్ధిపై వైకాపా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం చూపారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. -
రూ.కోట్ల విలువైన స్థలంఫై విష్ణు కన్ను
[ 04-05-2024]
నగరంలో గత అయిదేళ్లలో వైకాపా ప్రజాప్రతినిధులు.. ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా కబ్జా చేసేశారు. స్థానిక కార్పొరేటర్ల అండతో ప్రభుత్వ స్థలాలను మింగేశారు. -
బూతుల నేత.. మెరకలో మేత!
[ 04-05-2024]
శతకోటి అక్రమాలకు అనంతకోటి ఉపాయాలు! మట్టి నుంచి రూ. కోట్లు ఎలా పిండుకోవచ్చో గుడివాడ వెళ్లి చూస్తే తెలుస్తుంది.ఆ పిండుకున్నదాన్ని చట్టానికి దొరక్కుండా ఎలా జేబులో వేసుకోవచ్చో కూడా చూడొచ్చు. -
తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయుల దాడి
[ 04-05-2024]
బాపులపాడు మండలం కొత్తమల్లవల్లిలో తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ఇళ్ల మీదకు వెళ్లి దాడికి పాల్పడ్డారు. -
మళ్లీ అదే తంతు
[ 04-05-2024]
అనుమతి లేకుండా 59వ డివిజన్లోని పలు నివాసాలపై వైకాపా నేతలు ఆ పార్టీ స్టిక్కర్లు అంటించడం వివాదాస్పదమైంది. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను
[ 04-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని చిన్ని, శ్రీరాం తాతయ్య పేర్కొన్నారు. -
కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యం: సుజనా
[ 04-05-2024]
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు కృషి చేయాలని పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. -
చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
[ 04-05-2024]
నగరంలోని ఆంధ్రా ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే సౌజన్యంతో 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. -
తెదేపాతోనే యువతకు భవిష్యత్తు
[ 04-05-2024]
యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని విజయవాడ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
టికెట్టు లేని ప్రయాణాలకు జరిమానా
[ 04-05-2024]
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్టు లేని ప్రయాణికుల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రికార్డు స్థాయిలో డివిజన్కు రూ.7.96కోట్ల ఆదాయం లభించింది. -
ప్రధాని రోడ్షో భద్రతపై సమీక్ష
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షోలో పాల్గొననున్నారని ఇందుకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రధాని పర్యటనకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?