logo

కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఎన్నారైల ఎన్నికల ప్రచారం

అవనిగడ్డ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలకు విజయం చేకూర్చాలని ప్రచారం నిర్వహించారు.

Published : 04 May 2024 20:32 IST

ఘంటసాల: అవనిగడ్డ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలకు విజయం చేకూర్చాలని ప్రచారం నిర్వహించారు. ఘంటసాలకు చెందిన ఎన్నారైలు గొర్రెపాటి రంగనాథ బాబు, ఎన్నారై మూల్పూరి వెంకట్రావు, తెదేపా, జనసేన నాయకులతో కలిసి ఘంటసాల ఎస్టీ కాలనీ, అంబేడ్కర్‌ నగర్‌లో ఎన్నికల ప్రచారాన్ని శనివారం రాత్రి నిర్వహించారు. సూపర్ 6 కరపత్రాలను పంపిణీ చేశారు. ఓట్లను అభ్యర్థించారు. తెదేపా జనసేన నాయకులు గుమ్మడి గోపాలకృష్ణ,  గొర్రెపాటి వెంకట రామకృష్ణ, బండి పరాత్పరరావు, కొండపల్లి రామకృష్ణ, యోహాను, బుజ్జి, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులైన మండలి బుద్ధ ప్రసాద్, వల్లపనేని బాలశౌరీలను గెలిపించాలని కోరుతూ గోగినేనిపాలెంలో మండలి బుద్ధ ప్రసాద్ కుమార్తెలు కృష్ణప్రభ అవనిజ, తెదేపా, జనసేన నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్, తాడికొండ చిన్న, గుత్తికొండ కళ్యాణ్, కుంపటి సుబ్బారావు, యార్లగడ్డ వీరభద్రరావు, కొడాలి లక్ష్మణ్, పవన్ కుమార్ ,తదితరులు ఇంటింటికి వెళ్లి ఓట్ల అభ్యర్థించారు. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని