కోడ్ కొండెక్కి.. అక్రమంగా రోడ్డెక్కి
కోడ్ వచ్చి.. 10 రోజులైనా కళ్లెం పడనేలేదు. టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి. రాత్రుళ్లు తవ్వుతూనే ఉన్నారు. అడిగితే తీవ్ర బెదిరింపులు. చిన్నాచితక నాయకులు ఆపినా.. బడా నేతలు తవ్వేస్తున్నారు.
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
రాత్రుళ్లు వెంచర్లకు తరలింపు
ఈనాడు - అమరావతి
పట్టపగలే మట్టి దందా తీరు ఇది!
ఎన్నికల కోడ్ వచ్చే వరకు సహనంతో ఉండండి.. అప్పుడు అక్రమ తవ్వకాలు నిలిచిపోతాయి. చర్యలు తీసుకుంటాం. అక్రమార్కులు ధైర్యం చేయలేరు..!
విజయవాడ నగర సమీపంలో కొండలు, భూములను తవ్వుతున్న అక్రమార్కులపై ఫిర్యాదు చేస్తే.. గ్రామస్థులకు ఉన్నతాధికారులు చెప్పిన మాటలివి.
కోడ్ వచ్చి.. 10 రోజులైనా కళ్లెం పడనేలేదు. టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి. రాత్రుళ్లు తవ్వుతూనే ఉన్నారు. అడిగితే తీవ్ర బెదిరింపులు. చిన్నాచితక నాయకులు ఆపినా.. బడా నేతలు తవ్వేస్తున్నారు. జి.కొండూరు మండలం వెలగలేరు సమీపంలో తవ్వకాలు ఆపలేని దారుణమిది. వెలగలేరు నుంచి జి.కొండూరు మీదుగా నగరానికి మట్టి అక్రమ రవాణా భారీగా సాగుతున్నా రెవెన్యూ వారిది ప్రేక్షకపాత్రే. ఇటీవల రెండు జేసీబీలు అటవీ, గనుల అధికారులు పట్టుకోగా.. అటవీ శాఖ పీఐఆర్ నమోదు చేసింది. రూ.13 లక్షల జరిమానా వేశారు. మరోవైపు రెవెన్యూ అనధికార అనుమతులు ఇస్తున్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు వెంచర్లకు భారీగా మట్టి అక్రమ రవాణా చేస్తున్నారు.
తవ్వేస్తున్నారిలా..
రూ.కోట్ల సంపద..!
వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది. గనుల శాఖకు ఎగవేసిన సీనరేజీ సొమ్ము రూ.వందల కోట్లు అంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఆ శాఖ పలువురికి అక్రమ తవ్వకాలపై నోటీసులు ఇచ్చింది. ఈమేరకు రూ.300 కోట్లు విలువైన మట్టి తరలించారు. దీనికి పది రెట్లు జరిమానా విధించాలి. అంటే దాదాపు రూ.3 వేల కోట్లు. కానీ అక్రమార్కులు... తమకు సంబంధం లేదని సెలవిచ్చారు. ఆ గ్రామాల్లో 10 మీటర్ల లోతుకంటే ఎక్కువ తవ్విన దృశ్యాలే. ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ, అసైన్డ్ భూములనూ వదలక తవ్వేశారు. అటవీ శాఖ మూడుసార్లు విచారణ జరిపి సిబ్బందిపై చర్యలకు సిఫార్సు చేశారు. కొత్తూరు తాడేపల్లివాసి మెండెం జములయ్య అధికారులకు పదేపదే ఫిర్యాదు చేశారు. అటవీశాఖ సిబ్బందిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. మట్టి తవ్వకానికి ఎకరానికి రూ.10-20 లక్షలకు లీజుకు తీసుకుని అనుమతి లేకుండా తవ్వుతున్నారు. ఉన్నత స్థాయి ఒత్తిడితో యంత్రాంగానిది నియంత్రించలేని నిస్సహాయత.
క్షణాల్లో మాయం!
మట్టి అక్రమ తవ్వకాలు, తరలింపుపై దాడులు చేయాలని గ్రామస్థులు గనుల శాఖకు సమాచారమిస్తే.. వారు వెళ్లే సరికే అక్కడ లారీలు, యంత్రాలను చెట్లపొదల్లో దాచేస్తున్నారు. అలా దాచిన వాటిని తాము స్వాధీనం చేసుకోలేమని అధికారులు తేల్చేస్తున్నారు. కళ్లముందు తవ్విన ఆనవాళ్లున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో దాడులకు తెగిస్తారనే భయంతో వెళ్లలేని పరిస్థితి. పోలీసుల సహకారమూ లేదు. గ్రామస్థులు పట్టుబట్టి అధికారులను తీసుకెళితే.. జేసీబీలు, లారీలు మామిడి తోటల్లో దాచేశారు. గన్నవరం, మైలవరం పరిధిలో కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు, నున్న, కొత్తూరు, వేమవరం, షాబాద్, జక్కంపూడిలో కోడ్ వచ్చినా తవ్వకాలు ఆగలేదు. ఎన్జీటీ ఆదేశాలు, హైకోర్టు వ్యాజ్యాలనూ ఖాతరు చేయడం లేదు. ఈ తవ్వకాల వెనుక గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధి, అదే జిల్లాలో ఓ మంత్రి కీలకంగా, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార పార్టీ నాయకులు భాగస్వాములుగా ఉన్నారు.
వీరు ఎక్కడ..?
మండల, డివిజన్ స్థాయిలో టాస్క్ఫోర్సు బృందాలు వేయాలి. డివిజను స్థాయిలో సబ్ కలెక్టర్, ఇద్దరు ఏసీపీలు, పోలవరం ఈఈ, జిల్లా రవాణా శాఖ అధికారి, డీడీ గనుల శాఖ, విజయవాడ ఎఫ్ఆర్వోలు ఉంటారు. తహసీల్దారు, పోలీసు ఇన్స్పెక్టర్లు (ఎస్హెచ్వో), జిల్లా విజిలెన్సు రాయల్టీ ఇన్స్పెక్టర్, ఏఈఈ, డిప్యూటీ రేంజ్ అధికారులు ఉంటారు. అన్ని శాఖల అధికారులను కలెక్టర్ సమన్వయం చేస్తారు. ఇవేవీ ఏర్పాటే కాలేదు. దస్త్రాలకు మాత్రమే పరిమితం. పోలవరం కుడికాలువ, కొత్తూరు, తాడేపల్లి, జక్కంపూడి, పాతపాడు, వెలగలేరు, వేమవరం ప్రాంతాల్లో అభయారణ్యం పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. ఒక్కో మండలంలో మూడు బృందాలు పోలీసు రక్షణతో ఉండాలి. ఒక్కటీ ఏర్పాటు కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు’
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా