నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు.
నాలుగేళ్లలో అరకొరగానే పంటల బీమా
వైపరీత్యాలు వెంటాడుతున్నా జగన్ పరిహాసమే
మిగ్జాం బాధితులకు పరిహారం ఇవ్వరేం?
ఈనాడు, అమరావతి
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. నిరుడు మిగ్జాంతో పంట నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇంతవరకు పరిహారం జమకాలేదు. నెలన్నర కిందట జగన్ బటన్ నొక్కినా అతీగతీ లేదు.. ఆ డబ్బులు ఎప్పటికి వస్తాయో తెలీదు. పైగా అధికారులు పంట నష్టం లెక్కింపులోనూ గజిబిజి చేసేశారు. కాకి లెక్కలతో నివేదిక పంపి మమ అనిపించారు.
రైతు సంక్షేమం అని గొప్పలు చెప్పే ప్రభుత్వం.. రైతుల పాలిట శాపంగా తయారైంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పేరుతోనూ వారిని దగా చేసింది. రైతు నష్టపోయిన దానికి.. అందించిన బీమా పరిహారానికి అసలు పొంతనే లేదు. పత్తికి ఎకరాకు రూ.900 మాత్రమే బీమా వర్తింపజేసింది. కంచికచర్ల మండలంలో ఎకరా వరికి రూ.712 మాత్రమే బీమా పరిహారం అందింది.
కృష్ణా జిల్లాలో వరి పంటలు దెబ్బతినగా.. కేవలం ఒక్క గ్రామానికి మాత్రమే బీమా వర్తింపజేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. మరోవైపు వైకాపా నేతలు ఈ మాత్రానికే.. మా జగన్ రాజు కాదు.. రైతు అని పాలాభిషేకాలు చేశారు. ఈ పాలకైన ఖర్చుకు సమానంగానైనా బీమా రాలేదని చందర్లపాడు రైతులు వాపోతున్నారు. కనీసం ప్రైవేటుగా పంటలకు బీమా చేయించుకున్నా.. తమకు పరిహారం వచ్చేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
కాకి లెక్కలేనా..?
- గత ఖరీఫ్లో చేతికొచ్చిన వరిని మిగ్జాం తుడిచి పెట్టేసింది. కష్టనష్టాలపాలైన రైతులను ఆదుకోవడానికి సర్కారు వెంటనే గణన చేపట్టలేదు. పరిహారం చెల్లించేందుకు సరైన మార్గదర్శకాలను సకాలంలో విడుదల చేయలేదు. దీంతో గణన నెల రోజులు ఆలస్యమైంది.
- తుపాను గాలులకు నేలవాలిన వరి పైరును ఒక కేటగిరీ కింద, కోసి పనల మీద ఉండగా.. పొలంలో నీరు చేరి మొలకలు వచ్చిన పంటను రెండో కేటగిరీ కింద, తడిసిన ధాన్యాన్ని మూడో కేటగిరీ కింద చేర్చారు.
- కేవలం నేలవాలిన వరి పనల వివరాలనే లెక్కించారు.రి కోతల తర్వాత పనల మీద ఉన్న పంట, తడిసిన ధాన్యాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా ఈ రైతులు దారుణంగా మోసపోయారు.
- కృష్ణా జిల్లాలో 80 శాతం మంది కౌలు రైతులే. కేవలం 40 వేల మందికి మినహా మిగిలిన వారికి ఈ-క్రాప్ యజమాని పేరు మీదనే నమోదవుతోంది.
డబ్బులు పడలేదు..!
తుపానుతో దెబ్బతిన్న రైతులకు పరిహారం ఇచ్చేందుకు సీఎం జగన్ గత మార్చి 6న బటన్ నొక్కారు. అంతేకాదు.. నాడు భారీగా ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. గత ఐదేళ్లలో భారీ వర్షాలు, తుపాన్లకు దెబ్బతిన్న పంటల పరిహారం కోసం 12 సార్లు బటన్ నొక్కినట్లు ఘనంగా చాటింపు వేసుకున్నారు. కానీ.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాలుగుసార్లు మాత్రమే పెట్టుబడి రాయితీ బీమా పరిహారం అందిందని రైతులు చెబుతున్నారు. మిగ్జాం వచ్చి అయిదు నెలలు గడుస్తున్నా.. ఎన్నికల కోడ్ వస్తోందని ముందే బటన్ నొక్కిన సీఎం సొమ్ములను మాత్రం ఖాతాలో వేయలేదు.
బినామీలే మేసేశారు..
కొన్నిసార్లు పరిహారం మొత్తం పక్కదారి పట్టింది. ఏ.కొండూరులో మామిడి తోటల్లో సైతం పత్తి పంట దెబ్బతిందని నమోదు చేసి రూ.లక్షలు మింగేశారు. వీరులపాడు మండలంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. పరిహారాన్ని నేతల బినామీలే మేసేశారు.
కృష్ణా జిల్లాలో 92,318 మంది రైతులకు చెందిన 58,835.56 హెక్టార్లలో, ఉద్యాన పంటలు 1,209 మంది రైతులకు చెందిన 462.42 హెక్టార్లలో దెబ్బతిన్నాయని తేల్చారు. వరి ఇతర పంటలకు ఎకరాకు రూ.6,800 చొప్పున రూ.99.90 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.1.12 కోట్ల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఒక్కో రైతుకు ఐదెకరాలకే పరిహారాన్ని పరిమితం చేశారు. కానీ.. ఇంతవరకు ఆ సొమ్ము బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు.
వరిపైరు తొక్కించేశా
- ఆత్మూరి రామకోటేశ్వరరావు, నెమ్మలూరు
గత ఏడాది వచ్చిన తుపానుకు నాకున్న 13 ఎకరాల్లోని వరి పైరు పడిపోయి పాడవ్వగా ట్రాక్టర్తో తొక్కించేశాం. అధికారులొచ్చి చూసినా ప్రభుత్వం నుంచి ఒక్కపైసా సాయం కూడా రాలేదు. కష్టంలో ఉన్న రైతులను పట్టించుకోవాల్సిన పాలకులు, ప్రభుత్వం చేతులెత్తేయడం బాధాకరం. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం దురదృష్టకరం.
మొత్తం కుళ్లిపోయింది
- సీతారామయ్య, కౌలురైతు
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే: మొత్తం 14 ఎకరాల్లో గతేడాది వరి సాగు చేశా. ఇందులో నాలుగెకరాలు పనల మీదే దెబ్బతింది. బీపీటీ రకం సాగు చేసిన ఎకరంన్నర పొలమైతే పూర్తిగా నీటిలోనే ఉండిపోయిది. దాదాపుగా పనలన్నీ కుళ్లిపోయాయి. వాటిని ఎండబెట్టి నూర్చినా ఉపయోగం లేదని అలాగే వదిలేశా. ఎకరంన్నర పంట పూర్తిగా పోయినా పంట నష్టం నమోదు చేయలేదు.
ధాన్యం సొమ్ము రాలేదు
- బ్రహ్మేశ్వరరావు, చోడవరం
పెనమలూరు, న్యూస్టుడే: గతేడాది సార్వా ధాన్యం నగదు ఇంకా రాలేదు. తిరిగి ధాళ్వా కూడా వచ్చేసింది. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. గత ప్రభుత్వంలో సార్వా ధాన్యానికి రైతు ఖాతాకు సొమ్ములు తొందరగా జమ అయ్యేవి. కానీ వైకాపా ప్రభుత్వంలో అందుకు భిన్నంగా ఉంది.
యజమానులకే ధీమా..
- నిరుడు ఎన్టీఆర్ జిల్లాలో పత్తి రైతులకు దక్కాల్సిన బీమా మొత్తం యజమానులకే వెళ్లింది. బినామీల ఖాతాలకూ జమ అయింది. కారణం.. అక్కడ వ్యాపారులు పత్తి ఈ-క్రాప్ను తమ అనుచరుల పేరు మీద చేయించారు.
- బీమా పరిహారం విషయంలో ఒక గ్రామంలో పంట నష్టపోయి.. పక్క గ్రామంలో 33 శాతం కంటే తక్కువ నష్టం ఉంటే బీమా ఇవ్వడంలేదు. వర్షపాతం, దిగుబడి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయాల్సిన అవసరమేంటి?: పవన్
[ 04-05-2024]
జగన్ది డబుల్ డి (దాడులు, దోపిడీలు) ప్రభుత్వమని జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. -
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
[ 04-05-2024]
ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ సేవలకే పరిమితమైన పోలీస్శాఖ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా తీరు మార్చుకోవడం లేదు. -
జగన్.. ‘పైసా’చికానందం..!
[ 04-05-2024]
‘ఇది అత్యంత దారుణం.. పండుటాకులతో జగన్ పైశాచిక క్రీడ ఆడుతున్నారు. వృద్ధులంతా ఎండలో నరకం అనుభవించాలని.. తమ బాధకు కారణం.. వాలంటీర్లు లేకపోవడమేనని వాళ్లు భావించాలనేదే.. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. -
బ్యాలట్ కాదు.. బుల్లెట్
[ 04-05-2024]
ఒక పూటలో తినే కూరగాయల్నే ఏరి ఏరి కొంటాం.. మరి అయిదేళ్లకోసారి వేసే ఓటు ఆచితూచి వేయలేమా..! సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. -
సహకారానికి జగన్ కత్తెర
[ 04-05-2024]
సహకార చట్టం ప్రకారం.. సంఘానికి నిర్ధరిత కాలవ్యవధిలో ప్రత్యేక ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. -
జగన్ జమాన.. జనం భయాన!
[ 04-05-2024]
ప్రశాంతంగా కుటుంబంతో పార్కుకు వెళ్లాలంటే భయం.. పద్మావతి ఘాట్కో... కృష్ణవేణి ఘాట్కో వెళ్లి కొద్దిసేపు సేదదీరాలన్నా భయమే... నిర్మానుష్యంగా.. చీకటిగా ఉన్న రోడ్లపై వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే...ఎటువైపు నుంచి బ్లేడ్, గంజాయి బ్యాచ్లు దాడి చేస్తాయో తెలీదు. -
పోలీసుపై కొడాలి నాని ప్రధాన అనుచరుడి అరాచకం
[ 04-05-2024]
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడైన కసుకుర్తి జనార్దన్ (గుడ్లవల్లేరు బాబ్జి) ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆటోనగర్పై పగ.. శ్రామికులకు సెగ
[ 04-05-2024]
ఆసియాలోనే పెద్దదైన బెజవాడ ఆటోనగర్ పారిశ్రామికవాడ నేడు అనేక సమస్యలతో సతమతమౌతోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పట్టించుకోవడం మానేసింది. -
వంశీ, నానీ.. ‘దారి’ మరిచారేం?
[ 04-05-2024]
గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలకు ఎంతగానో ఉపకరించే కీలక రహదారి అభివృద్ధిపై వైకాపా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం చూపారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. -
రూ.కోట్ల విలువైన స్థలంఫై విష్ణు కన్ను
[ 04-05-2024]
నగరంలో గత అయిదేళ్లలో వైకాపా ప్రజాప్రతినిధులు.. ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా కబ్జా చేసేశారు. స్థానిక కార్పొరేటర్ల అండతో ప్రభుత్వ స్థలాలను మింగేశారు. -
బూతుల నేత.. మెరకలో మేత!
[ 04-05-2024]
శతకోటి అక్రమాలకు అనంతకోటి ఉపాయాలు! మట్టి నుంచి రూ. కోట్లు ఎలా పిండుకోవచ్చో గుడివాడ వెళ్లి చూస్తే తెలుస్తుంది.ఆ పిండుకున్నదాన్ని చట్టానికి దొరక్కుండా ఎలా జేబులో వేసుకోవచ్చో కూడా చూడొచ్చు. -
తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయుల దాడి
[ 04-05-2024]
బాపులపాడు మండలం కొత్తమల్లవల్లిలో తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ఇళ్ల మీదకు వెళ్లి దాడికి పాల్పడ్డారు. -
మళ్లీ అదే తంతు
[ 04-05-2024]
అనుమతి లేకుండా 59వ డివిజన్లోని పలు నివాసాలపై వైకాపా నేతలు ఆ పార్టీ స్టిక్కర్లు అంటించడం వివాదాస్పదమైంది. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను
[ 04-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని చిన్ని, శ్రీరాం తాతయ్య పేర్కొన్నారు. -
కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యం: సుజనా
[ 04-05-2024]
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు కృషి చేయాలని పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. -
చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
[ 04-05-2024]
నగరంలోని ఆంధ్రా ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే సౌజన్యంతో 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. -
తెదేపాతోనే యువతకు భవిష్యత్తు
[ 04-05-2024]
యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని విజయవాడ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
టికెట్టు లేని ప్రయాణాలకు జరిమానా
[ 04-05-2024]
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్టు లేని ప్రయాణికుల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రికార్డు స్థాయిలో డివిజన్కు రూ.7.96కోట్ల ఆదాయం లభించింది. -
ప్రధాని రోడ్షో భద్రతపై సమీక్ష
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షోలో పాల్గొననున్నారని ఇందుకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రధాని పర్యటనకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం