యార్లగడ్డ ప్రచారానికి అడ్డంకి.. ఆపై కత్తితో దాడి అని కేసు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు.
కొయ్యూరులో వైకాపా వర్గీయుల నిర్వాకం
తెదేపా నేతల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు. భారీ ప్రదర్శన నడుమ ప్రచారం నిర్వహించుకుంటూ వెళుతున్న యార్లగడ్డను అడ్డుకునే విధంగా కొందరు ట్రాక్టరు అడ్డుగా పెట్టారు. దీనిని తీయమని అడిగినా స్పందించలేదు. ఈ క్రమంలో దారికి అడ్డుగా కూర్చున్న ఒకరిని పక్కకు జరిపేందుకు తెదేపా స్థానిక నాయకులు ప్రయత్నించారు. దీనికి ససేమిరా అన్న అతడు ట్రాక్టరు బంపర్ని గట్టిగా పట్టుకోవడంతో చేతికి స్వల్ప గాయమైంది. దీంతో అతడ్ని గన్నవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించిన వైకాపా నాయకులు, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. తనపై సర్పంచి సత్యనారాయణతో సహా రామారావు, రామకృష్ణ కత్తితో దాడి చేశారంటూ జోజి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వైకాపా నాయకుల ఒత్తిడితో హనుమాన్జంక్షన్ పోలీసులు శనివారం ఉదయం సర్పంచి సత్యనారాయణ సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఇదే ఘటనలో వైకాపాకు చెందిన కొందరు తమపై దౌర్జన్యం చేశారంటూ తెదేపా వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదును మాత్రం పోలీసులు పెండింగ్లో పెట్టడం గమనార్హం. ఈ విషయంపై ఎస్సై జనార్ధన్ను ‘న్యూస్టుడే’ సంప్రదించగా, ఆసుపత్రి నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేశామని, డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతుందన్నారు. తెదేపా ఇచ్చిన ఫిర్యాదు పరిశీలనలో ఉందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి మృతి
[ 18-05-2024]
‘2019లో శస్త్రచికిత్స చేసి కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించుకునేందుకు ఆసుపత్రిలో చేరిందా యువతి. అందరితో నవ్వుతూ రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. అలా వెళ్లిన యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా విగతజీవిగా మారింది. -
జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుకు సన్నాహాలు
[ 18-05-2024]
ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు సంకేతాలు అందడంతో, జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం