logo

తుమ్మలపల్లి కళా క్షేత్రంలో పోస్టల్‌ బ్యాలట్‌ సదుపాయం

నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ విభాగాలకు చెందిన వారికి పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగ సౌకర్యాన్ని ఈ నెల 7, 8 తేదీల్లో కల్పించినట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.

Published : 07 May 2024 05:25 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ విభాగాలకు చెందిన వారికి పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగ సౌకర్యాన్ని ఈ నెల 7, 8 తేదీల్లో కల్పించినట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఫారం-12 అందజేసిన 1011 మంది ఆబ్సెంటీ ఓటర్లు, ఎసెన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన, అత్యవసర సేవలైన ఎయిర్‌పోర్టు, ఫుడ్‌ కార్పొరేషన్‌, రైల్వే, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, దూరదర్శన్‌, ఆకాశవాణి, విద్యుత్తు, వైద్యం, పౌరసరఫరాలు, బీఎస్‌ఎన్‌ఎల్‌, అగ్నిమాపక, మీడియా పర్సన్లు (ఆథరైజ్డ్‌ ఈసీఐ పోలింగ్‌ కవరేజీ) పోస్టల్‌ బ్యాలట్‌ను వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని