logo

ఆశీర్వదించండి...అండగా ఉంటా: కొల్లు

ఆశీర్వదించండి అందరికీ అండగా ఉంటానని కూటమి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన నగరంలోని 26,27,28 డివిజన్లతోపాటు బందరు మండల పరిధిలోని గుండుపాలెం, ఆర్‌.గొల్లపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు.

Published : 07 May 2024 05:34 IST

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: ఆశీర్వదించండి అందరికీ అండగా ఉంటానని కూటమి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన నగరంలోని 26,27,28 డివిజన్లతోపాటు బందరు మండల పరిధిలోని గుండుపాలెం, ఆర్‌.గొల్లపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బందరు రూపురేఖలు మారుస్తానని మాట ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని మించిన నటుడు పేర్ని నాని అయితే వారిద్దరినీ మించిపోయి నటిస్తున్న వ్యక్తి పేర్ని కిట్టూ అన్ని విమర్శించారు. నియోజకవర్గంలో కూటమి విజయం ఖరారు అయిపోయిందని, అత్యధిక మెజార్టీ ఇచ్చి వైకాపా నాయకులకు దిమ్మతిరిగేలా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ముస్లింలను నమ్మించి మోసం చేసిన ద్రోహి జగన్‌ అని, ఆయన మాటలు నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. ముస్లింల రిజర్వేషన్‌కోసం, వారి హక్కుల కోసం పోరాడింది చంద్రబాబునాయుడు ఒక్కరే అని తెలిపారు. అన్నివర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సూపర్‌-6 పథకాలు అందుబాటులోకి తెచ్చామన్నారు.  కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము, అన్నం ఆనంద్‌, జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజులతోపాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని