Published : 22 Jan 2022 12:56 IST
రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్లు బదిలీ
అమరావతి: రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ ను ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ను గుంటూరు మున్సిపల్ కమిషనర్గా, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ను అనంతపురం జేసీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Tags :