ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు

రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్‌కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది.

Updated : 07 May 2024 09:30 IST

రైతుల ఖాతాల్లో నేరుగా జమ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్‌కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. ఈ నిధులు ఆర్థికశాఖ ద్వారా బ్యాంకులకు చేరగా సోమవారం నుంచి నేరుగా ఎకరాకు రూ.5 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. రాష్ట్రంలో మార్చి 28 నాటికి ప్రభుత్వం 64,75,320 మంది రైతుల ఖాతాల్లో రూ.5,575 కోట్ల రైతుబంధు డబ్బులను జమచేయగా.. తాజాగా మిగిలిన వారికి నిధుల విడుదల చేపట్టింది. ఇంతవరకు మొత్తం 1,11,39,534 ఎకరాలకు సాయం అందింది. రాష్ట్రంలో 5 ఎకరాలకు పైగా ఉన్నవారు దాదాపు అయిదున్నర లక్షల మంది. ఇందులో 5 నుంచి 10 ఎకరాల వరకు ఉన్నవారు 4.4 లక్షలు, 10-24  ఎకరాలు ఉన్నవారు 94,000; 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారు 6,488 మంది ఉన్నారు. వీరందరికీ జమ చేసేందుకు మరో రూ.2 వేల కోట్ల మేరకు అవసరమని అధికారులు అంచనా వేశారు. మొదట్లో ప్రభుత్వం 5 ఎకరాల మేరకు సాయం అందించాలని భావించింది. మిగిలిన రైతులు కూడా సాయం కోరడంతో ప్రభుత్వం తాజాగా వారికి కూడా నిధులు ఇవ్వాలని నిర్ణయించి, ఆర్థికశాఖను ఆదేశించింది. ఈ మేరకు బ్యాంకులు రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తున్నట్లు సమాచారం.

గత భారాస ప్రభుత్వ హయాంలో చివరిసారిగా గత ఏడాది ఆగస్టులో వానాకాలం సీజన్‌కు మొత్తం 1,52,49,486.39 ఎకరాలకుగాను 68,99,976 మంది రైతులకు రూ.7,624.74 కోట్లు విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు