Sunita Williams: నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది.
కేప్ కెనావెరాల్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) రోదసి యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్లైనర్ (Boeing Starliner) వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్లో సాంకేతికత లోపం తలెత్తడమే దీనికి కారణం. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. కానీ, చివర్లో గుర్తించిన లోపం కారణంగా ప్రస్తుతానికి ఈ మిషన్ను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ప్రకటించింది. తిరిగి ఎప్పుడు చేపడతారనేది మాత్రం వెల్లచడించలేదు.
ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్లో ఉన్న కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్కు చెందిన అట్లాస్ V రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధమైంది. సరిగ్గా 90 నిమిషాల ముందు మిషన్ను ఆపేస్తున్నట్లు నాసా ప్రకటించింది. రాకెట్లోని ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ పనితీరు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. అప్పటికే వ్యోమనౌకలోకి ప్రవేశించిన సునీతా విలియమ్స్తో (Sunita Williams) పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
తాజా మిషన్లో భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో వారం పాటు బసచేయాలనేది ప్రణాళిక. స్టార్లైనర్ (Boeing Starliner) అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. 2019లో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్టార్లైనర్ తొలి మానవరహిత యాత్ర ఐఎస్ఎస్ను చేరుకోలేకపోయింది. మరో యాత్రలో పారాచూట్ సమస్యలు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. స్టార్లైనర్తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. తాజాది విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం స్పేస్ఎక్స్ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.
మిషన్ పైలట్గా వ్యవహరించాల్సిన సునీతకు (Sunita Williams) ఇది మూడో అంతరిక్ష యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. మునుపటి యాత్రలో భగవద్గీతను తీసుకెళ్లిన ఆమె ఈసారి తన ఆరాధ్య దైవం గణపతి విగ్రహాన్ని వెంట పట్టుకెళ్లనున్నట్లు వెల్లడించారు. స్టార్లైనర్కు ఇది మొదటి మానవసహిత యాత్ర కావడం వల్ల ఒకింత ఆత్రుతగా ఉందని అంతకుముందు వెల్లడించారు. అయినప్పటికీ గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
Afghanistan: ఆఫ్గాన్లో వరద కారణంగా 68 మంది మరణించినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు. -
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
స్విట్జర్లాండ్లో జరగనున్న శాంతి సదస్సుకు చైనా, గ్లోబల్ సౌత్ దేశాలు తమ ప్రతినిధులను పంపాలని జెలెన్స్కీ(Zelensky) కోరారు. -
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
రీడర్స్ డైజెస్ట్ (Reader's Digest) యూకే ఎడిషన్ను మూసివేసినట్లు ఆ సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. -
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
చైనా పర్యటన చేపట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ దేశాధినేత జిన్పింగ్ను ఆలింగనం చేసుకోవడంపై వైట్హౌస్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
Taiwan: తైవాన్లో పార్లమెంట్ సభ్యులు విచక్షణ మరిచి పరస్పరం దాడికి దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కిర్గిస్థాన్ (Kyrgyzstan) రాజధానిలో మూక హింస చెలరేగడంతో.. భారత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. -
మరింత సంపన్నులైన రిషి, అక్షతా దంపతులు
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. -
అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ పోటీ!
పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. -
2050 నాటికి పెరగనున్న ఆయుర్దాయం
ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. -
ఉత్తర గాజాలో హోరాహోరీ
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. -
ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది : డబ్ల్యూహెచ్వో
అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ సైమా వాజెడ్ చెప్పారు. -
ఖర్కీవ్ను ఆక్రమించే ప్రణాళికల్లేవ్
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. -
నరమేధానికి పాల్పడలేదు
గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి
యువకుడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది. -
పర్యావరణ హితులకు యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లు
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
Elon Musk: మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్