Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960

Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 67 పాయింట్ల లాభంతో 73,963 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,484 దగ్గర కొనసాగుతోంది.

Updated : 07 May 2024 11:52 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం ఆరంభంలో స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలున్నప్పటికీ.. మన మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 67 పాయింట్ల లాభంతో 73,963 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 22,484 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.48 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎం అండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌యూఎల్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, టైటన్‌, టీసీఎస్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఈ ఏడాదిలోనే ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల కోతకు శ్రీకారం చుడుతుందన్న ఊహాగానాల మధ్య అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం లాభాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా ప్రధాన సూచీలు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ సోమవారం నికరంగా రూ.2,169 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.781 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు