పిడికిలి బిగించి.. పోరాటం సాగించి!
ఎన్నో ఉద్యమాలు, ఎందరో సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితంగా భారతావని బానిస సంకెళ్లు తెంచుకుంది. దేశవాసులు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. బ్రిటీషు సామ్రాజ్య పాలనకు వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమంలో
ఆంగ్లేయులకు ఎదురొడ్డిన అనంతవాసులు
ఈనాడు డిజిటల్, అనంతపురం: ఎన్నో ఉద్యమాలు, ఎందరో సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితంగా భారతావని బానిస సంకెళ్లు తెంచుకుంది. దేశవాసులు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. బ్రిటీషు సామ్రాజ్య పాలనకు వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమంలో అనంతపురం జిల్లా పాత్ర కూడా ఉంది. గాంధీజీ స్వయంగా జిల్లాలో పర్యటించి ప్రజల్లో చైతన్యం నింపారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో వేలాదిగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. పలువురు సమరయోధులు గాంధీతోపాటు జైలుకు వెళ్లారు. అనంతవాసులు ఆర్థిక సాయం చేయడమే కాకుండా పిడికిలి బిగించి పోరాటాలు కొనసాగించారు. ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తయింది. ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా ఆనాటి ఉద్యమ ఘట్టాలపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం..
మద్యపాన నిషేధ ఉద్యమం
* గుత్తికి చెందిన పట్టుకేశవపిళ్లై 1885 డిసెంబరు 25న బొంబాయిలో జరిగిన తొలి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యారు. 1917లో అనిబిసెంట్ ప్రారంభించిన హోంరూల్ ఉద్యమానికి ఆయన మద్దతు పలికారు. జాతీయ కాంగ్రెస్కు అనిబిసెంట్ అధ్యక్షుడిగా ఎన్నిక కాగా కేశవపిళ్లై ఉపకార్యదర్శిగా పనిచేశారు.
* గాంధీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణోద్యమం దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం నింపింది. గుత్తిలో మద్యపాన నిషేధ ఉద్యమాన్ని కొనసాగించారు. గుత్తివాసులు 1930లో ఉప్పు సత్యాగ్రహంలోనూ పాల్గొన్నారు. బాబురాజేంద్రప్రసాద్ ఇక్కడ పలు గ్రామాల్లో పర్యటించడంతో ఉద్యమం మరింత ఊపందుకుంది. క్విట్ ఇండియా ఉద్యమంలో ఎన్పీ శర్మ, నరసింగరావు, లక్ష్మీనారాయణగౌడ్, వెంకటప్ప, చంద్రమౌళేశ్వరరావు, కొండారెడ్డి, పెద్దరాయప్ప, చిన్నరాయప్ప, ఆకుల నారాయణప్ప తదితరులు చురుకైన పాత్ర పోషించారు.
- గుత్తి
* మహాత్మగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంలో రాయదుర్గానికి చెందిన చెన్నప్ప, తిప్పయ్య పాల్గొన్నారు. గాంధీజీ వెంట నడిచి కర్ణాటకలోని కార్వారు జైలులో మూడు నెలలు శిక్ష అనుభవించారు. పట్టణానికి చెందిన నాగన్నగౌడ్ సత్యాగ్రహంలో పాల్గొని నెల్లూరు, తిరుచునాపల్లిలో జైలు శిక్ష అనుభవించారు.
అమ్మవారి ఆశీస్సులతో..
స్వాతంత్య్ర పోరాట సమయంలో ధర్మవరంలో ఖద్దరు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. గాంధీజీ స్వయంగా ఇక్కడి వచ్చి స్థానికుల్లో స్ఫూర్తి నింపారు. జాతీయ నేతల పిలుపు మేరకు రహస్య పోరాటాన్ని సాగించారు. ప్రస్తుతం ఉన్న పుట్లమ్మ దేవాలయంలో పల్లెం శ్రీనివాసులు ఆధ్వర్యంలో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి, ఉద్యమ వ్యూహాల్ని అమలు చేశారు. నిషేధ సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ధర్మవరంలో కొంతమంది వద్ద రహస్య పత్రాలు ఉన్నాయని తెలియడంతో పోలీసులు పలుమార్లు దాడులు కూడా చేశారు. వారికి దొరకకుండా జాగ్రత్త పడ్డారు. 1937లో పుట్లమ్మ గుడిపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన సందర్భంలో జనాలపై పోలీసులు లాఠీఛార్జి చేసి, పల్లెం శ్రీనివాసులును అరెస్టు చేసి బళ్లారి జైల్లో ఉంచారు.
- ధర్మవరం
పట్టాలు తొలగించి..
స్వాతంత్య్ర సమరయోధులు
గుంతకల్లులో బ్రిటీషు కార్యకలాపాలు ఎక్కువగా జరిగేవి. సైనికుల విడిది కేంద్రంగా ఉండేది. గుంతకల్లు కొట్టాలకు చెందిన బయ్యా వెంకటనాయుడు, పుల్లయ్య నాయకత్వంలో 1942లో గుంతకల్లు-బళ్లారి రైలు మార్గంలోని పట్టాలను తొలగించారు. గూడ్స్ రైలు ప్రమాదానికి గురికావడంతో సైనికులు ఊరిపై దాడి చేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా ఇష్టానుసారంగా కొట్టారు.
* 1943లో కసాపురం గ్రామానికి చెందిన శ్రీరాములు, నెట్టికల్లప్ప, బొలికొండప్ప, రమణప్ప, మేకల అంజి, రసూల్సాబ్, నారాయణచార్యులు, రామానుజచార్యులు గూడ్స్ రైలును పడగొట్టాలని నిర్ణయించుకున్నారు. నంచెర్ల సమీపంలోని పట్టాలను తొలగించారు. విషయం తెలుసుకున్న ఆంగ్లేయులు వారిని అరెస్టు చేసి బళ్లారి జైలులో వేశారు.
- గుంతకల్లు
ఆర్ట్స్ కళాశాల వేదికగా..
స్వాతంత్య్ర ఉద్యమానికి విద్యాలయాలు దోహదపడ్డాయి. ఉద్యమకారుల్ని తయారుచేసే కర్మాగారాలుగా పనిచేశాయి. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల స్వాతంత్య్ర పోరాటానికి వేదికగా నిలిచింది. కళాశాల 1916లో ఏర్పాటైంది. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, బళ్లారి జిల్లాలకు ఇదొక్కటే కళాశాల. రాయలసీమ, కర్ణాటక ఉద్యమకారులకు ఉమ్మడి వేదికగా ఉండేది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కళాశాలలో పెద్దఎత్తున తిరుగుబాటు జరిగింది. విద్యార్థులు రైళ్లను నిలిపేసి ఉద్యమించారు. కళాశాలలోని ప్రయోగశాలను తగులబెట్టారు. ప్రతిచర్యగా సిపాయిలు విద్యార్థి నాయకుల్ని అరెస్టు చేసి, కళాశాల నుంచి తొలగించారు.
- అనంత విద్య
బ్రిటీష్ బంగ్లాకు నిప్పు..
నల్లమాడ మండలం బసిరెడ్డిపల్లి వద్ద ఉన్న అటవీప్రాంతంలో అప్పట్లో ఆంగ్లేయులు బంగ్లాను నిర్మించుకున్నారు. ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఆంగ్లేయులు ఇక్కడే బసచేసేవారు. కదిరి ప్రాంతానికి చెందిన బసిరెడ్డిపల్లి వెంకటరెడ్డి, ముత్యాలచెరువుకు చెందిన శ్యామమూర్తి ఆధ్వర్యంలో పల్లెల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నినాదాలు చేసేవారు. ఈ నేపథ్యంలోనే బ్రిటీషు బంగ్లాకు నిప్పుపెట్టారు. దీంతో వెంకటరెడ్డి, శ్యామమూర్తి తదితరులను అరెస్టు చేసి జైలుకు పంపారు.
- కదిరి పట్టణం
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నా
గోవిందరెడ్డి దంపతులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి, సబ్కలెక్టర్ నవీన్ తదితరులు
‘1942లో ముంబయిలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నా. అప్పుడు నా వయసు 15 ఏళ్లు. వందేమాతరం.. గాంధీజీకి జై అంటూ నినాదాలు చేయగా పోలీసులు అరెస్టు చేశారు. జైల్లో ఉంచి చితకబాదారు. మైనర్ కావడంతో జడ్జి సూచన మేరకు విడుదల చేశారు. చదువుకునే వయసులో రాజకీయాలు వద్దని బుద్ధిగా చదువుకోమని సూచించారని’ స్వాతంత్య్ర సమరయోధుడు మెళవాయి గోవిందరెడ్డి తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆయనను మంగళవారం ఎమ్మెల్యే తిప్పేస్వామి, సబ్కలెక్టర్ నవీన్ సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యమంలో తన అనుభవాలను పంచుకున్నారు.
- మడకశిర గ్రామీణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం