logo

సైకో పోవాలి.. సైకిల్‌ గెలవాలి

తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్‌ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది.

Published : 26 Apr 2024 02:33 IST

ప్రచార వాహనంపై తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, తెదేపా నాయకులు

శింగనమల, న్యూస్‌టుడే : తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్‌ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. సైకిల్‌ గెలవాలి.. సైకో పోవాలి అంటూ నినాదాలు చేస్తూ చంద్రబాబుకు జైకొడుతూ తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా తరలివచ్చారు. శింగనమల పసుపుమయమైంది. శింగనమల మరువ కొమ్మ నుంచి ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక పాత మరవ వరకు ర్యాలీగా వచ్చారు. ఆ తర్వాత శ్రావణిశ్రీ ఎడ్ల బండిపై ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు.  తెదేపా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

ర్యాలీలో తెదేపా శ్రేణులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని