కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు.
తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు
ర్యాలీలో విజయసంకేతం చూపుతున్న అమిలినేని సురేంద్రబాబు
కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్టుడే : ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం ప్రజావేదిక నుంచి ప్రారంభమైన ర్యాలీ వాల్మీకి, మహాత్మాగాంధీ, అంబేడ్కర్ కూడలి మీదుగా టీ కూడలి వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు ఎలాంటి అభివృద్ధి చేయని గత పాలకులు ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న సమయంలో రంగయ్య నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే జీడిపల్లి నుంచి కృష్ణాజలాలు తీసుకొచ్చి 114 చెరువులను నీటితో నింపుతానని పేర్కొన్నారు. రహదారులు వేసి పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణను గెలిపించాలని కోరారు.
దుర్గం.. పసుపుమయం
నామినేషన్ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కళ్యాణదుర్గం పసుపుమయంగా మారింది. అభ్యర్థిని గజమాలతో సత్కరించారు. భారీ జనసందోహం మధ్య ర్యాలీ కొనసాగింది. నాయకులు, కార్యకర్తలు నృత్యాలతో సందడి చేశారు.
తరలివచ్చిన తెదేపా శ్రేణులు, ప్రజలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఉద్యోగులకు తప్పని ఇక్కట్లు
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది. రెండో రోజు కూడా అస్తవ్యస్తం, గందరగోళం కనిపించింది. సంబంధిత ఆర్వోలు నిర్దేశిత వసతులు, సౌకర్యాలు కల్పించడంలో అశ్రద్ధ చూపినట్లు తేలిపోయింది. -
రాకపోకలకు నిత్య నరకం
[ 05-05-2024]
ఉమ్మడి అనంత జిల్లాలో 2022 నవంబరులో భారీ వర్షాలకు వరదలొచ్చి జనజీవనం అతలాకుతలమైంది. వంకలు, వాగులు పొంగి పొర్లడంతో నీటి ప్రవాహ ధాటికి చాలాచోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. -
చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం
[ 05-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్చౌదరి, అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయులతో చెలగాటం
[ 05-05-2024]
జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ యంత్రాంగం ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం అడుతోంది. విధి నిర్వహణ పట్ల బాధ్యతా రాహిత్యం, అవగాహన లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు బహిర్గతమైంది. -
నిరుద్యోగులకు రూ.3వేలు భృతి
[ 05-05-2024]
‘‘తెదేపా సూపర్సిక్స్ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో రద్దయిన సంక్షేమ పథకాలన్నీ రానున్న కూటమి ప్రభుత్వంలో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. -
అసత్య ప్రచారం తప్ప వైకాపా చేసిందేమీ లేదు: సునీత
[ 05-05-2024]
ఐదేళ్ల మీ వైకాపా పాలనలో ఎమ్మెల్యేగా అసత్య ప్రచారాలు తప్ప నువ్వు చేసిందేమిటి ప్రకాశ్రెడ్డీ.. అని రాప్తాడు ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని పరిటాల సునీత ప్రశ్నించారు. -
కాలుపై సమాధానాలు రాసుకొచ్చిన విద్యార్థిని
[ 05-05-2024]
డిగ్రీ పరీక్షల్లో ఓ విద్యార్థిని కాలు మీద సమాధానాలు రాసుకొని పరీక్ష కేంద్రానికి హాజరైంది. గుర్తించిన ఇన్విజిలేటర్ డిబార్ చేశారు. అనంతపురం ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈ మాస్కాపీయింగ్ చోటు చేసుకొంది. -
బూతులు తిడుతున్నాడని దారుణ హత్య
[ 05-05-2024]
నిత్యం బూతులు తిడుతున్నాడన్న కోపంతో నిద్రిస్తున్న వ్యక్తిపై కొడవళ్లతో దాడిచేసి దారుణంగా చంపిన ఘటన కదిరి మండలం జౌకలలో జరిగింది. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
[ 05-05-2024]
మండలంలోని పాలసముద్రం, వడిగేపల్లి పంచాయతీల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి సవిత శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కేసు
[ 05-05-2024]
ధర్మవరం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 2వ పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శారదానగర్లో భాజపా కార్యకర్తలు భాను, శ్రీనివాసులుపై వైకాపా వర్గీయులు శుక్రవారం రాత్రి దాడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్