అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు.
వజ్రకరూరు: చాబాలగ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
వజ్రకరూరు, న్యూస్టుడే: అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. మండలంలోని ధర్మపురి, చాబాల, ఛాయపురం, పోట్టిపాడు, కమలపాడు, గూళ్యపాళ్యం గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు గజమాలలు, హారతులతో కేశవ్కు స్వాగతం పలికారు. పొట్టిపాడులో అనంతపురం జిల్లా తెదేపా జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు మాదవ్ కేశవ్ను మార్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కేశవ్ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన నిధులతో వైకాపా ప్రభుత్వం సోకులు పడుతుందన్నారు. నియోజకవర్గంలోని వైకాపా నాయకుడు విశ్వేశ్వరరెడ్డికు తాను తీయించిన పిల్లకాలువలకు నీరివ్వలేని అసమర్థ నాయకుడని విమర్శించారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిల్లకాలువలకు నీరందిస్తామన్నారు.. వైకాపా ప్రభుత్వంలో గ్రామాల్లో కనీసం మురుగునీటి కాలువలను కూడా విశ్వేశ్వర రెడ్డి నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. తాగునీటి ఎద్దడి నెలకొందని ఐదేళ్ల కాలంలో జానేడు పైపులైను కూడా వేయకుండా పల్లెలను దాహంతో గొంతెండేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా మండల అధ్యక్షుడు వేంకటేశ్, నాయకులు నాగేంద్ర, దస్తగిరి, మాజీ సర్పంచి ఎర్రిస్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూడేరు: ప్రచారం చేస్తున్న పయ్యావుల విక్రమ సింహ
కూడేరు (ఉరవకొండ): రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆ పార్టీ యువ నాయకుడు పయ్యావుల విక్రమసింహ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన కూడేరు మండలం ఇప్పేరులో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. తెదేపా మండల నాయకులు పాల్గొన్నారు.
రాయదుర్గం: ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం: పట్టణంలోని 23వ వార్డులో గురువారం సాయంత్రం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి, సూపర్సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు. రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కోరారు. 23వ వార్డు ఇన్ఛార్జి గుర్రమ్మ, తెదేపా నాయకులు మురళి, అజయ్కుమార్రెడి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఉద్యోగులకు తప్పని ఇక్కట్లు
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది. రెండో రోజు కూడా అస్తవ్యస్తం, గందరగోళం కనిపించింది. సంబంధిత ఆర్వోలు నిర్దేశిత వసతులు, సౌకర్యాలు కల్పించడంలో అశ్రద్ధ చూపినట్లు తేలిపోయింది. -
రాకపోకలకు నిత్య నరకం
[ 05-05-2024]
ఉమ్మడి అనంత జిల్లాలో 2022 నవంబరులో భారీ వర్షాలకు వరదలొచ్చి జనజీవనం అతలాకుతలమైంది. వంకలు, వాగులు పొంగి పొర్లడంతో నీటి ప్రవాహ ధాటికి చాలాచోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. -
చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం
[ 05-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్చౌదరి, అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయులతో చెలగాటం
[ 05-05-2024]
జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ యంత్రాంగం ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం అడుతోంది. విధి నిర్వహణ పట్ల బాధ్యతా రాహిత్యం, అవగాహన లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు బహిర్గతమైంది. -
నిరుద్యోగులకు రూ.3వేలు భృతి
[ 05-05-2024]
‘‘తెదేపా సూపర్సిక్స్ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో రద్దయిన సంక్షేమ పథకాలన్నీ రానున్న కూటమి ప్రభుత్వంలో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. -
అసత్య ప్రచారం తప్ప వైకాపా చేసిందేమీ లేదు: సునీత
[ 05-05-2024]
ఐదేళ్ల మీ వైకాపా పాలనలో ఎమ్మెల్యేగా అసత్య ప్రచారాలు తప్ప నువ్వు చేసిందేమిటి ప్రకాశ్రెడ్డీ.. అని రాప్తాడు ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని పరిటాల సునీత ప్రశ్నించారు. -
కాలుపై సమాధానాలు రాసుకొచ్చిన విద్యార్థిని
[ 05-05-2024]
డిగ్రీ పరీక్షల్లో ఓ విద్యార్థిని కాలు మీద సమాధానాలు రాసుకొని పరీక్ష కేంద్రానికి హాజరైంది. గుర్తించిన ఇన్విజిలేటర్ డిబార్ చేశారు. అనంతపురం ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈ మాస్కాపీయింగ్ చోటు చేసుకొంది. -
బూతులు తిడుతున్నాడని దారుణ హత్య
[ 05-05-2024]
నిత్యం బూతులు తిడుతున్నాడన్న కోపంతో నిద్రిస్తున్న వ్యక్తిపై కొడవళ్లతో దాడిచేసి దారుణంగా చంపిన ఘటన కదిరి మండలం జౌకలలో జరిగింది. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
[ 05-05-2024]
మండలంలోని పాలసముద్రం, వడిగేపల్లి పంచాయతీల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి సవిత శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కేసు
[ 05-05-2024]
ధర్మవరం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 2వ పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శారదానగర్లో భాజపా కార్యకర్తలు భాను, శ్రీనివాసులుపై వైకాపా వర్గీయులు శుక్రవారం రాత్రి దాడి చేశారు.