గోసంరక్షణ పట్టని జగన్
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు.
భక్తులు విరాళమిచ్చినా గోశాల నిర్వహించని దుస్థితిలో ప్రభుత్వం
పట్టణంలో వ్యర్థాలు తింటున్న గోవులు
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. ఇలా ఐదారేళ్లలో భక్తులు ఆలయానికి రూ.30 లక్షల మేర విరాళం ఇచ్చారు. పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు ఈ నిధులను బ్యాంకుల్లో భద్రంగా దాచిపెట్టి గోసంరక్షణను గాలికొదిలేశారు. దాతలు ఇచ్చే విరాళాలను మాత్రం చప్పుడు కాకుండా తీసుకుంటారని భక్తులు మండిపడుతున్నారు. వాటిని వినియోగించి మూగజీవాలైన గోవుల సంరక్షించాల్సిన బాధ్యత అధికారులు, పాలకవర్గంపై ఉంటుంది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు పాలకవర్గాలు మారాయి. అయినా ఆ దిశగా దృష్టి సారించలేదు. దీంతో ఆదాయం వచ్చే అభివృద్ధి పనుల వైపే మొగ్గు చూపారు. ఉపయోగం లేని కారణంగా ఆలయ గోవులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా గోవులు రహదారులే ఆవాసాలు, చెత్తలో పడేసిన కాగితాలే ఆహారంగా తింటూ జీవిస్తున్నాయి. మూగ రోదన పాలకవర్గం, ఆలయ అధికారులకు పట్టకపోవటం దారుణమని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
వృథాగా రూ.లక్షలు..
కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కటారుపల్లిలో రెండెకరాల భూమి ఉంది. అందులో తెదేపా హయాంలో ఆలయానికి భక్తులు ఇచ్చిన ఆవుల సంరక్షణకు శాలను నిర్మించారు. షెడ్డు, కాపలదారుకు ప్రత్యేక గది, నీటి వసతి లాంటి సదుపాయాలకు రూ.19 లక్షలు ఖర్చు చేశారు. గోవుల సంరక్షణకు ఫిక్స్డ్ డిపాజిట్గా కొంత మొత్తం ఉండాలన్న పిలుపుతో భక్తులు రూ.30 లక్షల వరకు విరాళం అందించారు. కానీ, ప్రస్తుత పాలకులు గోసంరక్షణ గాలి కొదిలేశారు. ఫలితంగా ఈ ప్రదేశంలో కట్టిన షెడ్డు, గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. అంతేగాకుండా మందుబాబులు, చీకటి కార్యకలాపాలకు ఆవాసంగా మారాయి.
శిథిలావస్థలో షెడ్డు
పశువుల మూగరోదన
నరసింహస్వామికి భక్తులు గోదానం గోప్యంగా చేస్తుంటారు. మొక్కులు తీరిన భక్తులు గోవులను ఆలయం వద్ద స్వామి పేరుచెప్పి వదిలేస్తుంటారు. అలా ఆలయానికి ఇచ్చినవి ఒకప్పుడు వందల్లో ఉండేవి. ఆరేళ్ల కిందట వాటి సంఖ్య 28కే పరిమితం చేశారు. రహదారులు ఆవాసాలవడంతో ప్రమాదాలు, కాగితాలు, ప్లాస్టిక్ కవర్లను తినటం వల్ల అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నాయి. కొందరు దుండగులు రాత్రిళ్లు చాటుగా కబేళాలకు తరలిస్తున్నారు. దీంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది. సంరక్షించలేని ఆలయ అధికారులు విరాళాలను తీసుకుని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఉద్యోగులకు తప్పని ఇక్కట్లు
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది. రెండో రోజు కూడా అస్తవ్యస్తం, గందరగోళం కనిపించింది. సంబంధిత ఆర్వోలు నిర్దేశిత వసతులు, సౌకర్యాలు కల్పించడంలో అశ్రద్ధ చూపినట్లు తేలిపోయింది. -
రాకపోకలకు నిత్య నరకం
[ 05-05-2024]
ఉమ్మడి అనంత జిల్లాలో 2022 నవంబరులో భారీ వర్షాలకు వరదలొచ్చి జనజీవనం అతలాకుతలమైంది. వంకలు, వాగులు పొంగి పొర్లడంతో నీటి ప్రవాహ ధాటికి చాలాచోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. -
చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం
[ 05-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్చౌదరి, అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయులతో చెలగాటం
[ 05-05-2024]
జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ యంత్రాంగం ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం అడుతోంది. విధి నిర్వహణ పట్ల బాధ్యతా రాహిత్యం, అవగాహన లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు బహిర్గతమైంది. -
నిరుద్యోగులకు రూ.3వేలు భృతి
[ 05-05-2024]
‘‘తెదేపా సూపర్సిక్స్ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో రద్దయిన సంక్షేమ పథకాలన్నీ రానున్న కూటమి ప్రభుత్వంలో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. -
అసత్య ప్రచారం తప్ప వైకాపా చేసిందేమీ లేదు: సునీత
[ 05-05-2024]
ఐదేళ్ల మీ వైకాపా పాలనలో ఎమ్మెల్యేగా అసత్య ప్రచారాలు తప్ప నువ్వు చేసిందేమిటి ప్రకాశ్రెడ్డీ.. అని రాప్తాడు ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని పరిటాల సునీత ప్రశ్నించారు. -
కాలుపై సమాధానాలు రాసుకొచ్చిన విద్యార్థిని
[ 05-05-2024]
డిగ్రీ పరీక్షల్లో ఓ విద్యార్థిని కాలు మీద సమాధానాలు రాసుకొని పరీక్ష కేంద్రానికి హాజరైంది. గుర్తించిన ఇన్విజిలేటర్ డిబార్ చేశారు. అనంతపురం ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈ మాస్కాపీయింగ్ చోటు చేసుకొంది. -
బూతులు తిడుతున్నాడని దారుణ హత్య
[ 05-05-2024]
నిత్యం బూతులు తిడుతున్నాడన్న కోపంతో నిద్రిస్తున్న వ్యక్తిపై కొడవళ్లతో దాడిచేసి దారుణంగా చంపిన ఘటన కదిరి మండలం జౌకలలో జరిగింది. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
[ 05-05-2024]
మండలంలోని పాలసముద్రం, వడిగేపల్లి పంచాయతీల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి సవిత శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కేసు
[ 05-05-2024]
ధర్మవరం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 2వ పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శారదానగర్లో భాజపా కార్యకర్తలు భాను, శ్రీనివాసులుపై వైకాపా వర్గీయులు శుక్రవారం రాత్రి దాడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు