మాట తప్పాడు.. మడత పెట్టాడు
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు.
సాగునీటి ప్రాజెక్టులపై హామీలను గాలికొదిలేసిన జగన్
ఐదేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడని వైనం
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. అనంతపురం మనవడిని అంటూ సెంటిమెంట్ డైలాగులు చెప్పి ఓట్లు దండుకున్నారే తప్ప.. ఉమ్మడి అనంత జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు రూపాయి కూడా ఇవ్వలేదు. నాన్నగారు రైతు బాంధవుడు.. నేను రైతు పక్షపాతినంటూ కోతలు కోసి.. అన్నదాతల గోడు ఏనాడు పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇవ్వడం.. సీఎంగా శంకుస్థాపన చేయడం మినహా గంప మట్టి తీయలేదు. కొత్తగా ఒక ఎకరాకు నీరు ఇవ్వకపోగా.. ఆయకట్టును బీళ్లుగా మార్చిన ఘనత జగన్కే దక్కుతుంది.
ఈనాడు డిజిటల్, అనంతపురం-న్యూస్టుడే, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట
శిలాఫలకం వెక్కిరిస్తోంది
‘జీడిపల్లి, పేరూరు ప్రాజెక్టులను అనుసంధానం చేసి రాప్తాడు నియోజకవర్గంలోని 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. రూ.803 కోట్లతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి వద్ద నాలుగు జలాశయాలను నిర్మిస్తాం. అత్యంత వేగంగా ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు మేలు చేస్తాం.’
2020, డిసెంబరు 9న జలశయాల నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం జగన్ చెప్పిన మాటలివి
శంకుస్థాపనతో సరి
సీఎం హోదాలో జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన జగన్.. పనుల్ని చేపట్టడం మర్చిపోయారు. మూడున్నరేళ్లుగా అంగుళం పని జరగలేదు. జీడిపల్లి నుంచి ఎగువ పెన్నా జలాశయం వరకు ఉన్న 53.45 కి.మీ. ప్రధాన కాలువపై నాలుగు ఎత్తిపోతల పథకాలు, 110 కాంక్రీటు కట్టడాలు చేపట్టాల్సి ఉంది. కొత్తపల్లి, ఆత్మకూరు, బాలవెంకటాపురం, మద్దెలచెరువు వద్ద ఎత్తిపోతలు నిర్మించాలి. నిధులు ఇవ్వకపోవడంతో పనులు ముందుకు వెళ్లలేదు. భూములిచ్చిన రైతన్నలకు పరిహారం పెంచి ఇస్తామని చెప్పి మోసం చేశారు.
ఆరు నెలలన్నారు.. మూడేళ్లు కావొస్తోంది
బీటీ ప్రాజెక్టు
‘జీడిపల్లి-భైౖరవానితిప్ప ప్రాజెక్టులో కీలకమైన భూసేకరణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేస్తాం. రైతులకు పరిహారం అందించి పనులు వేగవంతం చేస్తాం. కృష్ణా జలాలలో 114 చెరువులు నింపి ఆయకట్టుకు నీరందిస్తాం’
2021, జులై 8 తేదీన సీఎం జగన్
లభించని మోక్షం
భైరవానితిప్ప ప్రాజెక్టుకు జగన్ మోక్షం ప్రసాదించలేదు. రెండుసార్లు సీఎం హోదాలో హామీలు గుప్పించినా పనులు పునఃప్రారంభం కాలేదు. తెదేపా హయాంలో తవ్విన కాలువలు పూడిపోతున్నాయి. యంత్రసామగ్రి తుప్పు పట్టింది. చాలామంది రైతులకు పరిహారం అందించాల్సి ఉంది. 114 చెరువులు నింపుతామని చెప్పి పిల్ల కాలువలో నీరు పారించలేదు. ఫలితంగా భైరవానితిప్ప ఆయకట్టు రైతులు పొలాలను బీళ్లుగా వదిలేసి వలసలు వెళ్తున్నారు.
ఉంతకల్లుపై ఉత్తమాటలే..
ఉంతకల్లు-నేమకల్లు గ్రామాల మధ్య ఎన్ఏబీఆర్ జలాశయ ప్రతిపాదిత స్థలం
‘బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు శ్రీఆంజనేయస్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను మొదలుపెట్టి.. యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తాం’
2021, జులై 8న రాయదుర్గం పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం జగన్
ఊసేలేదు: హెచ్చెల్సీ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి తెదేపా ప్రభుత్వం తలపెట్టిన ఉంతకల్లు ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం గాలికొదిలేసింది. మూడేళ్లు దాటినా ఊసేలేదు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన డీపీఆర్ పనులు నిలిచిపోయాయి. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి వచ్చే వరద నీటిని నిల్వ చేసి అవసరమైన సమయంలో వాడుకోవాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వం 5 టీఎంసీల సామర్థ్యంతో ఉంతకల్లు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. డీపీఆర్ కోసం రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. 4,700 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. రూ.1180 కోట్ల అవసరమవుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ప్రణాళిక రూపొందించారు. వైకాపా ప్రభుత్వం రాగానే ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఉద్యోగులకు తప్పని ఇక్కట్లు
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది. రెండో రోజు కూడా అస్తవ్యస్తం, గందరగోళం కనిపించింది. సంబంధిత ఆర్వోలు నిర్దేశిత వసతులు, సౌకర్యాలు కల్పించడంలో అశ్రద్ధ చూపినట్లు తేలిపోయింది. -
రాకపోకలకు నిత్య నరకం
[ 05-05-2024]
ఉమ్మడి అనంత జిల్లాలో 2022 నవంబరులో భారీ వర్షాలకు వరదలొచ్చి జనజీవనం అతలాకుతలమైంది. వంకలు, వాగులు పొంగి పొర్లడంతో నీటి ప్రవాహ ధాటికి చాలాచోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. -
చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం
[ 05-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్చౌదరి, అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయులతో చెలగాటం
[ 05-05-2024]
జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ యంత్రాంగం ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం అడుతోంది. విధి నిర్వహణ పట్ల బాధ్యతా రాహిత్యం, అవగాహన లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు బహిర్గతమైంది. -
నిరుద్యోగులకు రూ.3వేలు భృతి
[ 05-05-2024]
‘‘తెదేపా సూపర్సిక్స్ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో రద్దయిన సంక్షేమ పథకాలన్నీ రానున్న కూటమి ప్రభుత్వంలో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. -
అసత్య ప్రచారం తప్ప వైకాపా చేసిందేమీ లేదు: సునీత
[ 05-05-2024]
ఐదేళ్ల మీ వైకాపా పాలనలో ఎమ్మెల్యేగా అసత్య ప్రచారాలు తప్ప నువ్వు చేసిందేమిటి ప్రకాశ్రెడ్డీ.. అని రాప్తాడు ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని పరిటాల సునీత ప్రశ్నించారు. -
కాలుపై సమాధానాలు రాసుకొచ్చిన విద్యార్థిని
[ 05-05-2024]
డిగ్రీ పరీక్షల్లో ఓ విద్యార్థిని కాలు మీద సమాధానాలు రాసుకొని పరీక్ష కేంద్రానికి హాజరైంది. గుర్తించిన ఇన్విజిలేటర్ డిబార్ చేశారు. అనంతపురం ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈ మాస్కాపీయింగ్ చోటు చేసుకొంది. -
బూతులు తిడుతున్నాడని దారుణ హత్య
[ 05-05-2024]
నిత్యం బూతులు తిడుతున్నాడన్న కోపంతో నిద్రిస్తున్న వ్యక్తిపై కొడవళ్లతో దాడిచేసి దారుణంగా చంపిన ఘటన కదిరి మండలం జౌకలలో జరిగింది. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
[ 05-05-2024]
మండలంలోని పాలసముద్రం, వడిగేపల్లి పంచాయతీల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి సవిత శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కేసు
[ 05-05-2024]
ధర్మవరం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 2వ పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శారదానగర్లో భాజపా కార్యకర్తలు భాను, శ్రీనివాసులుపై వైకాపా వర్గీయులు శుక్రవారం రాత్రి దాడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్