అధికార పార్టీ సేవలో దుర్గం పోలీసు అధికారి
ఎన్నికల నియమావళి పాటించడం లేదని, అధికార వైకాపాకు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని డీజీపీ, ఐజీ, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు.
వైకాపా నేతలకు మేలు చేకూర్చేలా
సివిల్ తగాదాల్లో తలదూరుస్తున్న వైనం
ఈనాడు డిజిటల్, అనంతపురం: ఎన్నికల నియమావళి పాటించడం లేదని, అధికార వైకాపాకు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని డీజీపీ, ఐజీ, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. రాయదుర్గం నియోజకవర్గంలోని ఓ పోలీసు అధికారి సైతం వైకాపా నాయకులకు వంత పాడుతున్నారు. వారికి మేలు చేకూర్చేలా సివిల్ తగాదాల్లో తలదూరుస్తున్నారు.
వారి మెప్పు పొందేందుకు విధుల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గత నెల 25న నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో సదరు అధికారి బందోబస్తు నిర్వహించారు. శాంతినగర్లో వారపు సంతలో రైతులు, వ్యాపారులు రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతుండగా వారందరినీ ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. రైతులు ప్రతిఘటించడంతో సీఐ వారిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రైతులు, వ్యాపారులు డివిజన్ స్థాయి పోలీసు అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన కల్పించుకుని రైతులకు సర్దిచెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని ఓ వైకాపా నాయకుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. దీనిపై ‘ఈనాడు’లో కథనం వెలువడింది. అధికారులు కేంద్రాన్ని స్వాధీనం చేసుకుని సదరు నాయకుడికి నోటీసులు ఇచ్చారు. అతడి నుంచి రూ.17లక్షలు రికవరీ చేసేందుకు వారం రోజులు గడువు ఇచ్చారు. గడువు మీరిపోవడంతో మున్సిపల్ అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని సదరు పోలీసు అధికారిని కోరగా.. ‘‘మీరు చెప్పినట్లు నేను కేసు ఎలా పెడతాను, నాలుగేళ్లలో ఎవరెవరు శుద్ధజల కేంద్రాన్ని నిర్వహించారో వివరాలు ఇవ్వండి’ అని మున్సిపల్ అధికారులను అడుగుతూ పరోక్షంగా వైకాపా నాయకుడిని రక్షించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. పట్టణంలోని కణేకల్లు రోడ్డులో ఉన్న స్థలాన్ని ఓ వివాహితకు గతంలో కేటాయించడంతో హౌసింగ్ శాఖ ఆమెకు ఇల్లు మంజూరు చేసింది. అందులో ఇల్లు నిర్మిస్తుండగా పట్టణ ప్రజాప్రతినిధి సమీప బంధువు ఈ స్థలం తనదేనని అడ్డు తగిలి పోలీసులను ఆశ్రయించాడు. బాధితురాలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆ స్థలం ఆమెదేనని స్పష్టం చేశారు. అయితే కోర్టు ఉత్తర్వులు, రెవెన్యూ అధికారుల ఉత్తర్వులు ఇవ్వాలని సదరు పోలీసు అధికారి బాధితురాలిని స్టేషన్కు పిలిపించి, పరోక్షంగా వైకాపా నాయకుడికి మద్దతు తెలిపారు. మంగళవారం కోతిగుట్టలో ఓ వైకాపా నాయకుడు వంకను ఆక్రమించేందుకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అడ్డుకుని ప్రొక్లెయిన్ను పోలీసులకు అప్పజెప్పారు. అయితే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదనే కారణం చూపి ప్రొక్లెయిన్ను గంట వ్యవధిలోనే వదిలేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉదయాన్నే ‘కారు’ చీకట్లు
[ 19-05-2024]
ఆ ఇంట మరో 8 రోజుల్లో పెళ్లి సంబరం జరగాల్సి ఉంది. వేడుక పనులు చకచకా జరుగుతున్నాయి. వరుడు, వధువు ఇళ్లు ముస్తాబు చేసే పనిలో అందరూ నిమగ్నమయ్యారు. ఇంతలో అనుకోని విషాదం కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో విధి వెంటాడింది. -
జగనన్న పాపం.. రైతులకు శాపం
[ 19-05-2024]
ప్రభుత్వ ప్రచార పిచ్చి.. అధికారుల నిర్లక్ష్యంతో రీసర్వేలో జరిగిన పొరపాట్లు రైతులకు శాపంగా మారుతున్నాయి. కొత్త పాసుపుస్తకాల్లో తప్పుల కారణంగా పంట రుణాల నవీకరణకు రైతులు అవస్థలు పడుతున్నారు. -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 19-05-2024]
జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం నిర్దేశిత ఏర్పాట్లు వేగంగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం జేసీ కేతన్ గార్గ్తో కలిసి ఆయన అనంత జేఎన్టీయూ భవన సముదాయంలో ఏర్పాటు చేసే ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగు రూంలు, రిసెప్షన్ కేంద్రాలను నిశితంగా పరిశీలించారు. -
జిల్లా నూతన ఎస్పీగా గౌతమిశాలి
[ 19-05-2024]
అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా గౌతమి శాలి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతం పెద్దకన్నెళ్లి గ్రామానికి చెందినవారు. -
తెలంగాణ ఈఏపీసెట్లో అనంత ఆణిముత్యాలు
[ 19-05-2024]
ఉమ్మడి అనంత జిల్లా విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఈఏపీసెట్లో మెరిశారు. కుశాల్కుమార్ ఆరో ర్యాంకు సాధించి సత్తా చాటగా, కదిరికి చెందిన దివ్యతేజ పదో ర్యాంకు సాధించారు. మరో ఇద్దరు విద్యార్థులు వందలోపే ర్యాంకులు దక్కించుకున్నారు. -
అర్జున్ తెందూల్కర్ వీర విహారం..
[ 19-05-2024]
-
సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ అస్తవ్యస్తం
[ 19-05-2024]
భూగర్భ జలాలు అడుగంటిపోవడం, సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో శ్రీసత్యసాయి జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. -
మొదలైన వజ్రాల వేట
[ 19-05-2024]
వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది. శుక్రవారం రాత్రి వర్షం కురవడంతో శనివారం ఉదయం పొలాలన్ని వజ్రాలు వెతికే వారితో నిండిపోయాయి. ఇక్కడ దొరికే చిన్న రాయి(వజ్రానికి)కి పెద్ద మొత్తంలో నగదు లభిస్తుంది. -
49 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్
[ 19-05-2024]
జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 49 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే సీబీఎస్సీఈ సిలబస్ అమలు చేయనున్నట్లు కడప విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకుడు రాఘవరెడ్డి పేర్కొన్నారు. -
జూనియర్ ఇంటర్లో మిగులు సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్
[ 19-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి బాలబాలికలకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆ విద్యాలయాల జిల్లా సమన్వయకర్త ఎ.మురళీకృష్ణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!