logo

నేడు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ రాక

తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు తిరుపతి నగరంలో పర్యటించనున్నారు.

Published : 07 May 2024 02:56 IST

తిరునగరిలో రోడ్డుషో, బహిరంగ సభ

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు తిరుపతి నగరంలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక లీలామహల్‌ కూడలి నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు రోడ్‌షో నిర్వహించి, అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, నేతలు నరసింహయాదవ్‌, కిరణ్‌రాయల్‌, భానుప్రకాష్‌రెడ్డిలు పర్యవేక్షించారు. ఇద్దరు అధినేతల రాక కోసం నగరవాసులు, ఎన్డీయే అభిమానులు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు