logo

ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు: జనసేన

పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌ ప్రకటించారు. శుక్రవారం కాకినాడలో మాట్లాడుతూ, సలహాదారులను ఇష్టానుసారంగా నియమించి, ఖజానా

Published : 22 Jan 2022 05:23 IST


మాట్లాడుతున్న కందుల దుర్గేశ్‌, పంతం నానాజీ తదితరులు

కాకినాడ కలెక్టరేట్‌: పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌ ప్రకటించారు. శుక్రవారం కాకినాడలో మాట్లాడుతూ, సలహాదారులను ఇష్టానుసారంగా నియమించి, ఖజానా ఖాళీ చేశారని ఎద్దేవా చేశారు. పీఏసీ సభ్యుడు పంతం నానాజీ మాట్లాడుతూ ఇసుక, మద్యం విషయంలో ఖజానాకు రావాల్సిన సొమ్మును సొంత ఖాతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. పీఆర్సీ కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులపై దాడి చేయమని మంత్రులు వైకాపా శ్రేణులకు ఆదేశాలిచ్చారని ఆరోపించారు. నాయకులు రాజబాబు, శేషు కుమారి, చంద్రశేఖర్‌, సత్యనారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని