శతాధిక వృద్ధుడి మృతి
ముమ్మిడివరానికి చెందిన శతాధిక వృద్ధుడు తణుకు సుబ్రహ్మణ్యం(102) మంగళవారం మృతి చెందారు. 1920లో జన్మించిన ఆయన ముమ్మిడివరంలో సుధీర్ఘకాలం పాటు టైలరింగ్ వృత్తి నిర్వహించారు.
సుబ్రహ్మణ్యం
ముమ్మిడివరం, న్యూస్టుడే: ముమ్మిడివరానికి చెందిన శతాధిక వృద్ధుడు తణుకు సుబ్రహ్మణ్యం(102) మంగళవారం మృతి చెందారు. 1920లో జన్మించిన ఆయన ముమ్మిడివరంలో సుధీర్ఘకాలం పాటు టైలరింగ్ వృత్తి నిర్వహించారు. సుబ్రహ్మణ్యంకు అయిదుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు సంతానం కాగా, 14 మంది మనుమలు, మునిమనుమలు ఉన్నారు.
కారు ఢీకొని మహిళ..
ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలం అనాతవరంలో జాతీయ రహదారి-216పై ఓ డ్రైవింగ్ స్కూలు కారు ఢీకొని మహిళ మృతిచెందారు. అమలాపురం గ్రామీణం కామనగరువుకు చెందిన జి.వెంకటరత్నం భార్య అమ్మాజీ(55)తో కలిసి ద్విచక్ర వాహనంపై ఓ పెళ్లికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా అనాతవరం వద్ద డ్రైవింగ్ స్కూలుకు చెందిన కారు వెనుక నుంచి వారి వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో రోడ్డుపై పడిపోయిన అమ్మాజీ మీదుగా కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. ఆమె కొడుకు, కూతురు ఉద్యోగాల నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్బాబు తెలిపారు.
గోదావరిలో దూకి యువకుడి గల్లంతు
ఐ.పోలవరం, న్యూస్టుడే: ఐ.పోలవరం మండలం మురమళ్లలోని రాఘవేంద్ర వారధిపైనుంచి వృద్ధగౌతమి గోదావరిలోకి దూకి ఓ యువకుడు మంగళవారం గల్లంతయ్యాడు. తన ద్విచక్ర వాహనాన్ని వారధిపై వదిలి గోదావరిలో దూకినట్లుగా స్థానికులు గుర్తించారు. వాహనంలో ఉన్న బ్యాంకు పుస్తకం ఆధారంగా బండారులంక గ్రామంలోని దంగేటివారిపాలేనికి చెందిన దంగేటి శ్రీతేజగా పోలీసులు భావిస్తున్నారు. 26 ఏళ్ల వయసున్న శ్రీతేజ పల్లవారిపాలెంలోని తన సోదరుడు మురళీకృష్ణతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఎలక్ట్రికల్ వైండింగ్ చేసుకుని జీవనం సాగించే శ్రీతేజకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. ఆత్మహత్యకు యత్నించడానికి కారణాలు తెలియరాలేదు. అతనికోసం పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు