ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనే లక్ష్యం
ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకుని గురువారం రాజమహేంద్రవరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ ప్రారంభిస్తున్న కలెక్టర్ మాధవీలత, డీఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రత్యూషకుమారి తదితరులు
రాజమహేంద్రవరం వైద్యం: ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకుని గురువారం రాజమహేంద్రవరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రత్యూషకుమారి, డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారిణి వసుంధర, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమేష్ తదితరులతో కలిసి ర్యాలీ ప్రారంభించారు. అంబేడ్కర్ భవన్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. హెచ్ఐవీ, టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఎంహెచ్వో వినూత్న, వైద్యాధికారిణి కోమల, సీడీపీవో సీహెచ్వీ నరసమ్మ, మూడోపట్టణ సీఐ మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
272 గ్రామాల్లో సర్వే
వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం): శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంలో భాగంగా ప్రస్తుతం 272 రెవెన్యూ గ్రామాల్లో డ్రోన్ల ద్వారా భూ రీసర్వే ప్రక్రియ జరుగుతోందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి భూ రీసర్వేపై సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్ గురువారం దూరదృశ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్ పథకంలో భాగంగా ఎంపిక చేసిన 44 గ్రామాల్లో 13వ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. సమగ్ర రీసర్వే పూర్తయిన వెంటనే భూముల ఇన్వర్డ్, గ్రామ సచివాలయం రిజిస్ట్రేషన్, సర్వే పూర్తిచేసిన తర్వాత భూయజమానికి క్యూఆర్ ఆధారిత స్మార్ట్ టైటిల్ కార్డులు అందజేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.