logo

బాబాయ్‌నే చంపేశాడు

వరుసకు పిన్ని అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అడిగినందుకు బాబాయ్‌నే చంపేశాడు. ఈ అమానవీయ ఘటన దేవరపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 07 Jun 2023 05:04 IST

మృతుడు నాగేశ్వరరావు

దేవరపల్లి, న్యూస్‌టుడే: వరుసకు పిన్ని అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అడిగినందుకు బాబాయ్‌నే చంపేశాడు. ఈ అమానవీయ ఘటన దేవరపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

దేవరపల్లిలోని జ్యోతినగర్‌కు చెందిన కె.నాగేశ్వరరావు(45)కు, తణుకుకు చెందిన మహిళతో చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. అదే గ్రామంలో ఉంటున్న నాగేశ్వరరావు అన్న కొడుకు కె.దుర్గాప్రసాద్‌కు ఆమెతో ఏడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నాలుగేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇలా ఉండగా.. సోమవారం రాత్రి తన ఇంటికి వచ్చిన అన్న, వదినలతో నాగేశ్వరరావు ఈ విషయంపై చర్చించారు. మీ కొడుకు వల్ల తన కాపురం నాశనమైందని ఆగ్రహం చెందారు. జరిగిన విషయాన్ని ఆమె చరవాణిలో దుర్గాప్రసాద్‌కు చెప్పగా అదే రోజు అర్ధరాత్రి సమయంలో అతడు ఆవేశంగా వచ్చి, తన ఇంటి సమీపంలో ఓ దుకాణం అరుగుపై పడుకున్న నాగేశ్వరరావును ఇనుపరాడ్‌తో బలంగా కొట్టాడు. స్పృహ కోల్పోయిన అతణ్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే ప్రాణాలు పోయినట్లు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున డీఎస్పీ వర్మ, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై శ్రీహరిరావు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుడి తల్లి పెద్దింట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళ, దుర్గాప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడు దుర్గాప్రసాద్‌కు రెండేళ్ల క్రితం వివాహం కాగా ఏడు నెలల పాప ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని